Bhagwant Mann: పంజాబ్ సీఎంకు చుక్కెదురు.. భగవంత్ మాన్ విదేశీ టూర్కు కేంద్రం నిరాకరణ
- పంజాబ్ సీఎంకు చుక్కెదురు
- భగవంత్ మాన్ విదేశీ టూర్కు కేంద్రం నిరాకరణ
- కేంద్రంపై ఆమ్ ఆద్మీ పార్టీ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ ప్రభుత్వానికి-కేంద్రానికి మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డుకట్ట వేసింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్ దేశాలకు వెళ్లేందుకు కేంద్ర అనుమతి కోరారు. కానీ అందుకు కేంద్రం నిరాకరించింది. ఇలా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం ఇది మూడోసారి. విదేశీ పర్యటనకు అనుమతి పొందడంలో మూడోసారి విఫలమయ్యారు. జనవరిలో యునైటెడ్ కింగ్డమ్ (యూకే), ఇజ్రాయెల్ పర్యటనకు అనుమతి నిరాకరించబడింది. తాజాగా ఇప్పుడు మరోసారి కేంద్రం అడ్డుకుంది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్, యూకే పర్యటనకు ముందు గతంలో పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు ఫ్రాన్స్ను సందర్శించేందుకు భగవంత్ మాన్ అనుమతి కోరగా.. అప్పుడు కూడా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అనుమతి ఇవ్వలేదు. ఇలా వరుసగా మూడోసారి భగవంత్ మాన్కు నిరాకరించింది.
ఇది కూడా చదవండి: Rohit Paudel: హృదయాలను గెలిచిన నేపాల్.. ఓటమిపై కెప్టెన్ రియాక్షన్ ఇదే..
కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ధ్వజమెత్తింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆప్ ఆరోపించింది. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు కేంద్రం విధించిన ఆంక్షలు దెబ్బతీస్తున్నాయని మండిపడుతున్నారు. వచ్చే నెలలో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సుకు పంజాబ్ ముఖ్యమంత్రి రెండు యూరోపియన్ దేశాల్లో ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాల్సి ఉందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Cryptocurrency Tragedy: హైదరాబాద్ పాతబస్తీలో విషాదం.. క్రిప్టో నష్టాలతో యువకుడి ఆత్మహత్య
ప్రొటోకాల్ ప్రకారం… ముఖ్యమంత్రులు ఏదైనా అధికారిక విదేశీ ప్రయాణానికి వెళ్లే ముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి రాజకీయ అనుమతి పొందాలి. అయితే భగవంత్ మాన్కు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఎందుకు అనుమతి ఇవ్వలేదన్నది కారణం వెల్లడించలేదు. దీంతో రాజకీయ దుమారం రేగుతోంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!