Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
- సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం
- కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
- సుప్రీంకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయవాదులను సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కొత్తగా నియమితులైన వారిలో ప్రస్తుతం పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ షీల్ నాగు కూడా ఉన్నారు. ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి న్యాయ సేవలను ప్రారంభించి వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు.
అలాగే, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే (Justice Alok Aradhe) సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. ఆయన మాతృ హైకోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టు. మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన గతంలో ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు.
Also Read
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
జమ్మూ కాశ్మీర్, లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లి సైతం సుప్రీంకోర్టు బెంచ్లో చోటు దక్కించుకున్నారు. ఆయన పంజాబ్, హర్యానా హైకోర్టుకు చెందిన సీనియర్ న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు. ఇక ప్రముఖ సీనియర్ న్యాయవాది వెంకటరమణి సుబ్రమణియన్ మోహన్ (Venkataramani Subramanian Mohan) కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలం న్యాయవాదిగా సేవలందించిన ఆయనకు ఇది కీలక పదోన్నతిగా భావిస్తున్నారు.
కొలీజియం సిఫార్సులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
మే 22, మే 27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఐదు పేర్లను సిఫార్సు చేసింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం పరిశీలించి నియామకాలకు ఆమోదం తెలిపింది. త్వరలో రాష్ట్రపతి ఆమోదం అనంతరం వీరు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టనున్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు
ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి Narendra Modi అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు కూడా ఆమోదం లభించింది. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 మంది న్యాయమూర్తుల మంజూరైన సంఖ్యను 39కు పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడం, న్యాయ వ్యవస్థ పనితీరును మరింత సమర్థవంతంగా మార్చడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ నియామకాలతో సుప్రీంకోర్టు ధర్మాసనం మరింత బలోపేతం కానుండగా, పెండింగ్ కేసుల పరిష్కారంలో వేగం పెరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
In exercise of the power conferred by clause (2) of Article 124 of the Constitution of India, the President of India, after consultation with Chief Justice of India, is pleased to appoint the following as Judges of the Supreme Court of India. I convey my best wishes to them:- pic.twitter.com/WxHaRYWF6p
— Arjun Ram Meghwal (@arjunrammeghwal) June 1, 2026
తాజావార్తలు
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!