మా పథకం వల్లే దేశంలో మహిళల సంఖ్య పెరిగింది: కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో లింగ నిష్పత్తిలో మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. గతంలో మగవారు ఎక్కువగా ఉండగా ఆడవారు తక్కువగా ఉండేవారు. అందుకే మగాళ్లకు పిల్ల దొరకడం లేదని మన పెద్దవాళ్లు కామెంట్ చేసేవాళ్లు. అయితే ఇప్పుడు దేశంలో మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారని శనివారం నాడు లోక్సభలో కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. దేశంలో మహిళలు, పురుషుల నిష్పత్తి 1020: 1000గా ఉందని జాతీయ ఆరోగ్య సర్వేలో స్పష్టమైందని తెలిపారు. దేశంలో 1020 మంది మహిళలు ఉంటే… 1000 మంది పురుషులు ఉన్నారని పేర్కొన్నారు.
Read Also: హైదరాబాద్లో రికార్డు సృష్టించిన ‘చలి’
Also Read
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
- Bihar: ఇన్స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
- Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
అయితే దేశంలో మహిళల సంఖ్య పెరగడాన్ని తమ ఘనతగా కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ చెప్పుకున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో.. బేటీ పడావో పథకం వల్లే దేశంలో మహిళల సంఖ్య పెరిగిందని.. ఈ పథకం వల్ల మహిళల అభివృద్ధి జరుగుతోందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. మరోవైపు మహిళల స్థితిగతుల్లో కూడా మార్పులు వచ్చాయి. సొంత భూమి, ఇల్లు ఉన్న మహిళల సంఖ్య 38.4 శాతం నుంచి 43 శాతానికి చేరినట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో స్పష్టమైంది. ఈ విషయంలో పట్టణ ప్రాంతాల్లో మహిళలు 38.3 శాతంగా ఉండగా గ్రామీణ ప్రాంతాల మహిళలు 45.7 శాతంతో మెరుగైన స్థితిలో ఉన్నారు.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!