బీజేపీయేతర రాష్ట్రాలంటే అంత అలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తుందా? కావాలనే శకటాలను ఎంపిక చేయలేదా? అన్న ప్రశ్నలు మరోసారి తెరమీదకు వచ్చాయి. రిపబ్లిక్ డే శకటాల విషయంలో.. కేంద్ర-రాష్ట్రాల మధ్య మరో వివాదం రాజుకుంది. అయితే దీనితో తమకు సంబంధం లేదని చెబుతోంది కేంద్రం. గణతంత్ర వేడుకల్లో కొన్ని రాష్ట్రాల శకటాలకు ప్రాతినిధ్యం లభించకపోవడం పట్ల కేంద్రం, ఆయా రాష్ట్రాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి.
తెలుగు రాష్ట్రాల శకటాలకు మరోసారి అనుమతి దక్కలేదు. రిపబ్లిక్ డే వేడుకల్లో 12 రాష్ట్రాలు, 9 శాఖల శకటాలకు అనుమతినిచ్చింది కేంద్రం.. తెలంగాణ, ఏపీకి మాత్రం మళ్లీ నిరాశే మిగిల్చింది. దక్షిణాదిలో ఒక్క కర్ణాటక తప్పా.. మిగతా రాష్ట్రాల శకటాలను ఎంపిక చేయలేదు. శకటాల విషయంలో కేంద్ర-రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే బెంగాల్ శకటాన్ని కేంద్రం కావాలనే ఎంపిక చేయలేదని.. తమ రాష్ట్ర శకటాన్ని తిరస్కరించి బెంగాల్ ప్రజలను అవమానించారని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. దీనిపై జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు.
Also Read
- EPFOలో కీలక మార్పులు.. పోర్టల్లో రెండు సేవలకు ముగింపు..
- Kavitha: కవితకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఝలక్..!
- UAPA Terrorists List: మరో కఠిన నిర్ణయం.. 23 మంది పేర్లను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన కేంద్రం
- Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
తమ రాష్ట్రాల శకటాలకు స్థానం కల్పించకపోవడంపై పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేరళ కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. తమ శకటాన్ని తిరస్కరించడంపై ముఖ్యమంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు కేరళతో పాటు పలు రాష్ట్రాల నేతలు కూడా తమ రాష్ట్రాన్ని అవమానించారంటూ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో శకటాల లొల్లి తారా స్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వివాదాస్పదమైంది.
మమతా, స్టాలిన్ విమర్శలపై కేంద్రం స్పందించింది. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ప్రతిపాదించిన శకటాలను తిరస్కరించడంలో తమ పాత్రేమి లేదని.. ఏయే శకటాలను అనుమతించాలనేది నిపుణుల కమిటీ నిర్ణయిస్తుందని తేల్చి చెప్పింది. రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టిస్తుందని తెలిపింది కేంద్రం. ఈ వివాదంపై జర్మనీలో ఉంటున్న నేతాజీ కుమార్తె అనితా బోస్ కూడా స్పందించారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా జరుగుతున్న గణతంత్ర ఉత్సవాల్లో.. ఆయన గుర్తుగా రూపొందించిన శకటం లేకపోవడం వింతగా ఉందన్నారు. ఇందులో రాజకీయ కారణాలు ఉన్నాయని విమర్శించారామె.
2018, 2021 గణతంత్ర వేడుకల్లో కేరళ శకటానికి స్థానం దక్కించుకుంది. తమిళనాడు శకటం 2016, 2017, 2019, 2020, 2021 వేడుకల్లో… పశ్చిమ బెంగాల్ శకటం 2016, 2017, 2019, 2021 ఉత్సవాల్లో ప్రాతినిధ్యం వహించాయి. సున్నితమయిన అంశాలపై విమర్శలు చేయడం మంచిదికాదంటోంది బీజేపీ.
తాజావార్తలు
-
Samantha: ‘సామ్ జామ్’ తర్వాత హోస్ట్గా మళ్లీ సమంత.. తమిళంలో కొత్త టాక్ షో ప్లాన్?
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
EPFOలో కీలక మార్పులు.. పోర్టల్లో రెండు సేవలకు ముగింపు..
-
Dell Alienware 15: డెల్ ఏలియన్వేర్ 15 గేమింగ్ ల్యాప్టాప్ భారత్లో విడుదల.. RTX 4050 GPU, AMD Ryzen ప్రాసెసర్
-
Prithviraj Sukumaran: తెలుగులో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఐ, నోబడీ’ రిలీజ్
ట్రెండింగ్
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!