UAPA Terrorists List: మరో కఠిన నిర్ణయం.. 23 మంది పేర్లను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UAPA Terrorists List: ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పేర్లను UAPA నాలుగో షెడ్యూల్లో 58 నుంచి 80 వరకు క్రమ సంఖ్యలతో చేర్చింది. వీరిలో ఎక్కువ మంది జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తైబా వంటి ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా ఉండి, పాకిస్థాన్ లేదా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో 2016లో నగ్రోటా సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడి, 2022లో జమ్మూలోని సుంజ్వాన్ ప్రాంతంలో భద్రతా బలగాలపై జరిగిన దాడులతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మసూద్ ఇలియాస్ కాశ్మీరీ, మహమ్మద్ ముసాదిక్, ముఫ్తీ మహమ్మద్ అస్గర్ ఖాన్, హాఫిజ్ అబ్దుల్ షకూర్ తదితరుల పేర్లు ఉన్నాయి. అలాగే లష్కర్-ఎ-తైబాతో సంబంధం ఉన్న అబ్దుల్ రౌఫ్, హాఫిజ్ ఖాలిద్ వలీద్ పేర్లను కూడా జాబితాలో చేర్చారు. వీరు లష్కర్ వ్యవస్థాపకుడు హాఫిజ్ మహమ్మద్ సయీద్కు సన్నిహితులుగా కేంద్రం పేర్కొంది. మరోవైపు బెంగళూరుకు చెందిన మహమ్మద్ షాహిద్ ఫైసల్ అలియాస్ ఉస్తాద్, అలియాస్ జాకిర్ ప్రస్తుతం పాకిస్థాన్లోని రావల్పిండిలో ఉంటున్నట్లు గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
Also Read
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్పింగ్ సాయం.. ట్రంప్కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- Ivolga high-speed train: భారత్కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
ప్రభుత్వం ప్రకారం, మహమ్మద్ షాహిద్ ఫైసల్కు లష్కర్-ఎ-తైబా, అల్-ఖైదా, ఐసిస్కు అనుబంధంగా ఉన్న మాడ్యూళ్లతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాద సంస్థల్లోకి ఆకర్షించడం, ఆయుధాల శిక్షణకు సహకరించడం, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమీకరించడం వంటి చర్యల్లో పాల్గొన్నట్లు పేర్కొంది. హోం మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నారనే ఆధారాల మేరకు UAPA సెక్షన్-35 కింద వారి పేర్లను నాలుగో షెడ్యూల్లో చేర్చినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో పేర్లు చేర్చడంతో వారి ఆస్తులపై చర్యలు, ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు, ఇతర చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ గెజిట్ నోటిఫికేషన్ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రాకేష్ రాఠీ జారీ చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేసే దిశగా కేంద్రం తీసుకున్న మరో కీలక చర్యగా దీనిని అధికారులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!