Ukraine Crisis: భారత ప్రభుత్వం కీలక నిర్ణయం… ఉక్రెయిన్కు ప్రత్యేక విమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ రష్యా మధ్య భీకరపోరు జరుగుతున్నది. ఎలాగైనా ఉక్రెయిన్ నుంచి బయటకు వచ్చేయాలని చాలా మంది ప్రజలు చూస్తున్నారు. ఉక్రెయిన్లో సుమారు 16 వేల మంది భారతీయులు ఉన్నారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు మారుతున్న సమయంలో భారత ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీని ప్రకటించింది. భారతీయులు వెంటనే వెనక్కి వచ్చేయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక విమానాలను పంపింది. పరిస్థితులు దిగజారిపోతున్న సమయంలో సుమారు 4 వేల మంది భారతీయులు వెనక్కి వచ్చేశారు. వీలైనంత త్వరగా భారతీయులను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో రష్యా అనూహ్య నిర్ణయం తీసుకొని యుద్ధం ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్ గగనతలాన్ని మూసేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం వెనక్కి వచ్చేసింది.
Read: Russia: కీలక నిర్ణయం… యూకే విమానాలపై నిషేధం…
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
కాగా, యుద్ధం మరింత ముదురుతున్న సమయంలో భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు యుద్ధప్రాతిపథికన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. రొమేనియా, హంగేరీ సరిహద్దుల నుంచి భారతీయులను తరలించాలని నిర్ణయించింది. భారతీయులను తరలించేందుకు కొన్ని బృందాలు రొమేనియా సరిహద్దు ప్రాంతమైన పొరుబ్నే-సీరెత్ వద్ద, హంగరీ సరిహద్దు ప్రాంతమైన చోప్ జొహోనీ వద్ద ఉన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న భారతీయులను ముందుగా అక్కడినుంచి తరలించేందుకు కేంద్రం కృషి చేస్తున్నది.
తాజావార్తలు
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..