ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. 78 రోజుల వేతనం బోనస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండుగ పూట రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం… నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్గా ఇవ్వాలని నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. ఈ నిర్ణయంతో రైల్వేలోని 11.56 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో.. ఉద్యోగులకు బోనస్తో పాటు రైల్వేకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయాల్.. ఈ విషయాన్ని వెల్లడించారు. మొత్తంగా.. దీపావళి పండుగ సమయంలో రైల్వే ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది కేంద్రం.
అర్హులైన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరికీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 78 రోజుల వేతనాలకు సమానమైన పీఎల్బీ చెల్లింపు కోసం రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రివర్గం ముందు ప్రతిపాదనను సమర్పించగా.. ఈరోజు కేబినెట్ ఆమోదించింది. రైల్వేలపై ఉన్న పీఎల్బీ మొత్తం దేశమంతటా విస్తరించి ఉన్న నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరినీ (ఆర్పీఎఫ్/ఆర్పీఎస్ఎఫ్ సిబ్బంది మినహా) కవర్ చేస్తుంది. కాగా, అర్హత కలిగిన రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లింపు ప్రతి ఏడాది దసరా సెలవులకు ముందు ఇస్తుంటారు. గత సంవత్సరం, భారత రైల్వే తన 11.58 లక్షల నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల వేతనంతో కూడిన బోనస్ని అందించింది.
Also Read
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
తాజావార్తలు
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!