కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గత రెండేళ్లుగా దేశంలో టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిన కాలర్ ట్యూన్లు ఎట్టకేలకు నిలిచిపోనున్నాయి. ఎప్పుడూ కాల్ చేసినా ‘కరోనాపై పోరాటంలో మనం పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో’ అంటూ వినిపించే కాలర్ ట్యూన్లతో ప్రజలు విసిగెత్తిపోయారు. ఈ కాలర్ట్యూన్ సెల్ఫోన్ వినియోగదారులకు పలు సందర్భాల్లో చికాకు కూడా తెప్పించేది. అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో టెలికాం ఆపరేటర్లు ఈ కాలర్ ట్యూన్ను త్వరలో తొలగించనున్నారు.
ఈ కాలర్ ట్యూన్ కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్కాల్ మాట్లాడటం ఆలస్యమవుతోందని వినియోగదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 ప్రీ-కాల్ సందేశాలను తొలగించేందుకు పరిశీలన చూస్తోంది. ఈ సందేశాలను నిలిపివేయాలని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖకు టెలీకమ్యూనికేషన్ల విభాగం లేఖ రాసింది. చాలా మంది వినియోగారులు అత్యవసరంగా కాల్ చేయాల్సిన సమయంలో కరోనా కాలర్ ట్యూన్ను డియాక్టివేట్ చేయడానికి టెలికాం ఆపరేటర్లను సంప్రదించేవారని.. ఆర్టీఐ ద్వారా అనేక ఫిర్యాదులను జోడించి ఈ కాలర్ ట్యూన్ తొలగించాలని అభ్యర్థించినట్లు లేఖలో పేర్కొంది. కాగా త్వరలోనే కరోనా కాలర్ ట్యూన్ తొలగించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పినట్లు తెలుస్తోంది.