ఢిల్లీ బాంబ్ పేలుడు యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ప్రశాంతంగా ఉన్న దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు బ్లాస్ట్ అయింది. పెద్ద ఎత్తున విస్ఫోటనం జరగడంతో ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక ప్రజలు అయోమయానికి గురయ్యారు. అక్కడికక్కడే కొందరు ప్రాణాలు కోల్పోగా.. ఇంకొందరు గాయపడ్డారు. మరికొందరు ప్రాణభయంతో పరుగులు తీశారు.
ఇది కూడా చదవండి: Shaheen: ప్రొఫెసర్ నుంచి ఉగ్రవాదిగా ఎలా మారింది? డాక్టర్ షాహీన్ బ్యాగ్రౌండ్ ఇదే!
తాజాగా బాంబ్ బ్లాస్ట్కు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం (10-11-2025) సాయంత్రం 6:50 గంటల ప్రాంతంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్-1 సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇందులో హ్యుందాయ్ ఐ20 కారు ఒక్కసారిగా పేలిపోయింది. అధిక తీవ్రతతో కూడిన పేలుడు సంభవించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైంది. సీసీటీవీ ఫుటేజ్ ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఇక ఈ పేలుడులో ఇప్పటి వరకు 12 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Dubai: దుబాయ్ ఎడారిలో రష్యన్ క్రిప్టో వ్యాపారవేత్త దంపతులు హత్య.. అసలేం జరిగిందంటే..!
ఇదిలా ఉంటే ఫరీదాబాద్లో అరెస్టైన డాక్టర్ ముజమ్మిల్ నుంచి కీలక విషయాలను రాబట్టాయి. ఎర్రకోట దగ్గర జరిగిన దాడి దీపావళి నాడు ప్లాన్ చేసినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. దీపావళి నాడు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో దాడి చేయాలని ప్లాన్ చేశామని.. అనంతరం ఆ ప్లాన్ రద్దు చేసుకున్నట్లుగా ముజమ్మిల్ దర్యాప్తు అధికారులకు చెప్పినట్లుగా సమాచారం. ఇక ఈ ప్లాన్ను జనవరి 26, 2026న అమలు చేయాలని ప్రణాళిక వేసుకున్నామని.. ఇందులో భాగంగానే ఎర్రకోట చుట్టు పక్కల ప్రాంతాలను గుర్తించినట్లుగా ముజమ్మిల్ పోలీసులకు తెలియజేసినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి.
VIDEO | CCTV footage captures the exact moment of the blast near Delhi's Red Fort.
A blast took place in a slow-moving car at a traffic signal near the Red Fort metro station on Monday evening, killing 12 people, injuring many and gutting several vehicles.
(Source: Third Party)… pic.twitter.com/xjpScNpJ5Y
— Press Trust of India (@PTI_News) November 12, 2025