CBI Searches: మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్లో సీబీఐ తనిఖీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBI Searches: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్ను సీబీఐ అధికారులు ఇవాళ ఓపెన్ చేశారు. ఘజియాబాద్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్లో సిసోడియాకు లాకర్ ఉండగా.. దర్యాప్తుకు సంబంధించి ఆ లాకర్ను సీబీఐ సోదా చేసింది. డిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియాను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఇటీవల ఉపసంహరించుకున్న ఎక్సైజ్ పాలసీలో ఆరోపించిన కుంభకోణంపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి సీబీఐ అధికారులు ఆ లాకర్ను పరిశీలించారు. బ్యాంకుకు సిసోడియాతో పాటు ఆయన భార్య కూడా వెళ్లారు. దాదాపు రెండు వారాల క్రితం సిసోడియా ఇంట్లోనూ సీబీఐ సోదాలు చేపట్టింది. తన లాకర్లో కూడా ఏమీ దొరకదని సోమవారమే మనీష్ సిసోడియా తెలిపారు. ఆగస్టు 19న తన ఇంట్లో 14 గంటలపాటు జరిపిన సోదాల్లో ఏమీ దొరకలేదు.. లాకర్లో కూడా ఏమీ దొరకదు.. సీబీఐకి స్వాగతం. విచారణకు నా కుటుంబం, నేనూ పూర్తిగా సహకరిస్తామని సోమవారం మనీష్ సిసోడియా హిందీలో ట్వీట్ చేశారు.
Robbery: సినీఫక్కీలో భారీ చోరీ.. తుపాకీ తలపై గురిపెట్టి.. ఎంత ఎత్తుకెళ్లారో తెలుసా?
Also Read
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
మద్యం పాలసీ కేసులో సీబీఐ 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాంట్లో సిసోడియా పేరు కూడా ఉంది. లంచాలు తీసుకుని అర్హులు కానివాళ్లకు లైసెన్సులు జారీ చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వంపై ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది నవంబర్లో ప్రవేశపెట్టిన కొత్త పాలసీ వల్ల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ కొత్త పాలసీని విత్డ్రా చేశారు. ఈ మద్యం విధానాన్ని అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అనుమతి లేకుండా గత ఏడాది నవంబరులో ప్రవేశపెట్టారని సీబీఐ ఆరోపించింది. లంచాలు తీసుకుని అర్హత లేని మద్యం వ్యాపారులకు అనుమతులు ఇచ్చారని ఆరోపించింది. ఈ ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఎనిమిది నెలల తర్వాత ఈ విధానాన్ని ఉపసంహరించుకుందని తెలిపింది.
సీబీఐ దాడిలో నా నివాసంలో ఏమీ దొరకనట్లే ఈరోజు తన బ్యాంక్ లాకర్లో ఏమీ దొరకలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు. తనకు క్లీన్ చిట్ లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. సీబీఐ అధికారులు తమతో మంచిగా వ్యవహరించారని.. తాము కూడా వారికి సహకరించామని సిసోడియా పేర్కొన్నారు. ఎట్టకేలకు నిజం గెలిచిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..