Supreme Court: అత్యాచార కేసులో నిందితులు విడుదల..”బెనిఫిట్ ఆఫ్ డౌట్” కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Supreme Court released the three accused under the benefit of doubt: 2012లో ఢిల్లీలో జరిగిన అత్యాచార కేసులో మరణశిక్ష పడిన ముగ్గురు నిందితులను సుప్రీంకోర్టు సోమవారం విడుదల చేసింది. ఈ ముగ్గురిపై కేసు నిరూపించడంతో ప్రాసిక్యూషన్ విఫలమైందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ‘‘ బెనిఫిట్ ఆఫ్ డౌట్’’ కింద ఈ ముగ్గురిని విడుదల చేసింది. 2019లో 19 ఏళ్ల యువతిపై అత్యాచారం, హత్య, చిత్ర హింసలు కేసు కింద ముగ్గురికి ట్రయల్ కోర్టు శిక్ష విధించింది. నిందితులు రవికుమార్, రాహుల్, వినోద్ దోషులుగా నిర్థారించిన ట్రయల్ కోర్టు వీరి ముగ్గురికి మరణశిక్ష విధించింది. ఢిల్లీ హైకోర్టు దీనిని సమర్థించింది. వీరి ముగ్గురిని ఎరకోసం వేటాడే వేటగాళ్లతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
అయితే ఈ ముగ్గురు తమ శిక్షను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా దోచులను నిర్థారించే సమయంలో కోర్టు‘‘ పాసివ్ అంపైర్’’లా వ్యవహరించిందని చీఫ్ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేల ఎం త్రివేదిల త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ ముగ్గురిపై అభియోగాలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలం అయిందని పేర్కొంది. నిందితులను గుర్తించే క్రమంలో చాలా తప్పులు జరిగాయని తెలిపింది. విచారణ సమయంలో 49 మంది సాక్షుల్లో 10 మందిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదని పేర్కొంది. దర్యాప్తు సమయంలో ఒక్కసాక్షి కూడా నిందితులను గుర్తించలేదని పేర్కొంది. కోర్టులు చట్టాలకు లోబడి కేసులను ఖచ్చితంగా గుర్తించాలి.. ఎలాంటి బయటి నైతిక ఒత్తిళ్లకు ఇతరత్రా ప్రభావాలకు లోనుకాకూడదని పేర్కొంది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Lunar Eclipse Live: ప్రారంభమైన సంపూర్ణ చంద్రగ్రహణం.. మూతపడ్డ ఆలయాలు
ఈ ఆత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు కారణం అయిన నిర్భయ ఘటనకు కొన్ని నెలల ముందు జరిగింది. ఉత్తరాఖండ్ కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి గురుగ్రామ్ లోని సైబర్ సిటీలో పనిచేస్తుంది. విధులు ముగించుకుని వస్తున్న సమయంలో అపహరణకు గురైంది. ఈ ఘటన 2012 ఫిబ్రవరిలొో జరిగింది. కిడ్నాప్ జరిగిన కొన్ని రోజులకు హర్యానాలోని రేవారీ జిల్లాలోని ఒక పొలంలో యువతి మృతదేహం దారుణమైన పరిస్థితుల్లో కనిపించింది. కారులోని టూల్స్ సహాయంతో, మట్టికుండలతో కొట్టి చంపినట్లు తేలింది. అంతే కాకుండా.. యువతి కళ్లలో యాసిడ్ యాసిడ్ పోసి, ఆమె ప్రైవేటు పార్టుల్లో మద్యం బాలిళ్లను దూర్చి అత్యంత పాశవికంగా హత్య చేశారు నిందితులు.
ఈ కేసులో కింది కోర్టు విధించిన ఉరి శిక్షను తగ్గించాలని కోరుతూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దీన్ని ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. నేరం బాధితురాలిపైనే కాకుండా సమాజంపై జరిగిందని వారు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో యువతి తల్లిదండ్రులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది గుడ్డి న్యాయవ్యవస్థ యఅని.. తాము విచారణ కొనసాగిస్తామని నొక్కి చెప్పారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
-
Imad Wasim: మాజీ భార్య సంచలన ఆరోపణలు.. మౌనం వీడిన పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!