Maharashtra: ట్రంప్ పేరుతో నకిలీ ఆధార్ కార్డు.. ఎమ్మెల్యేపై కేసు
- ట్రంప్ పేరుతో నకిలీ ఆధార్ కార్డు
- శరద్ పవార్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో నకిలీ ఆధార్ కార్డు సృష్టించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో శరద్పవార్ పార్టీకి చెందిన ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం దేశంలో ఓట్ల చోరీపై విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఇంకోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ ఓటర్ల కార్డులు ఎలా పొందవచ్చునో అని శరద్ పవార్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోహిత్ పవార్.. అక్టోబర్ 16న జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.. ఒక వెబ్సైట్లో నకిలీ ఆధార్ కార్డులను ఎలా తయారు చేస్తున్నారో.. నకిలీ ఓటర్ల నమోదు ఎలా చేస్తున్నారో చూపించారు. దీనిపై బీజేపీ సోషల్ మీడియా సెల్ కో-కన్వీనర్ ధనంజయ్ వాగస్కర్ ఫిర్యాదు చేశారని.. ఆ ఫిర్యాదు ఆధారంగా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఎమ్మెల్యే తెలిపారు.
Also Read
- NEET UG Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. భారత్లో టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం!
- Insurance Murder Case : రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రియుడితో కలిసి భర్తని చంపింది.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు!
- US-Iran శాంతి ఒప్పందం.! పెట్రోల్ నుంచి హోం లోన్ వరకు.. భారతీయులకు ఎలాంటి ప్రభావం పడనుందంటే.!
- Land Missile: భారత అంబులపొదిలో మరో అస్త్రం.. భూతల దాడి క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఇది కూడా చదవండి: Mumbai: ముంబైలో నకిలీ శాస్త్రవేత్త అరెస్ట్.. అణు డేటా ఉన్నట్లుగా అనుమానాలు!
బోగస్ వెబ్సైట్ ద్వారా బోగస్ ఆధార్ కార్డులను సృష్టించడం ద్వారా సమాజంలోని రెండు వర్గాల మధ్య తప్పుదారి పట్టించడానికి.. విభేదాలు, శత్రుత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నించారని ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆరోపించారు. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి ప్రతికూల ఫలితాలు వచ్చాయని… కానీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి బోగస్ ఓటర్ల కారణంగా ఎన్డీఏ కూటమి గెలిచిందని రోహిత్ పవార్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Trump-Jinping: ట్రంప్-జిన్పింగ్ భేటీ వేళ చైనాకు ఊరట.. సుంకాలు తగ్గింపు
ప్రతికూల ఓటర్లను చనిపోయినట్లు చూపించారని.. అనంతరం చనిపోయిన వ్యక్తుల పేరుతో నకిలీ ఓటింగ్ జరిగిందని ఆరోపించారు. 2019, 2024 లోక్సభ ఎన్నికల మధ్య 32 లక్షల మంది ఓటర్లు అదనంగా చేరారని.. అంటే సంవత్సరానికి 6.5 లక్షల మంది ఓటర్లు లేదా నెలకు 54,000 మంది అదనంగా చేరారని తెలిపారు. కానీ 2024 లోక్సభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మధ్య కేవలం ఆరు నెలల్లోనే 48 లక్షల మంది ఓటర్లు అదనంగా చేరారని వివరించారు. లోక్సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలోని తన సొంత కర్జాత్ జామ్ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 14,292 మంది ఓటర్లు చేర్చారని.. 5,360 మంది పేర్లను తొలగించారని. 14,162 నకిలీ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. ఒక నియోజకవర్గంలోని ఓటరు ఆధార్ కార్డును వేరే నియోజకవర్గంలోని మరొక ఓటరు నమోదు కోసం ఉపయోగించి.. ఫొటో, పేరు మార్చిన సందర్భాలు ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
తాజావార్తలు
-
Sanchita Ugale : సంచితా ఉగలే ఆత్మహత్యతో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుకు సంబంధం ఉందా?
-
Explained: రెండూ మెసేజింగ్ యాప్లే కానీ.. వాట్సాప్ను వదిలేసి టెలిగ్రామ్నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
-
Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
-
Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
-
OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?