Delhi Election 2025: ఢిల్లీ సీఎం అతిషికి బిగ్ షాక్.. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందుకు కేసు నమోదు!
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం అతిషికి బిగ్ షాక్..
- ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతిషిపై కేసు..
- వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ వాహనాన్ని వాడుకుంటున్నారని రిటర్నింగ్ అధికారి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Election 2025: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సింగ్ పై రిటర్నింగ్ అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఎం వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ వాహనాన్ని వాడుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. జనవరి 7వ తేదీన ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత పీడబ్ల్యూడీ గవర్నమెంట్ వెహికిల్ ఆప్ కార్యాలయానికి ఎన్నికల ప్రచార సామాగ్రిని అందజేస్తోందని ఫిర్యాదులో వెల్లడించారు.
Read Also: Gaza Truce Deal: ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి.. బందీలు విడుదలయ్యే ఛాన్స్..
Also Read
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
ఇక, ఈ విషయమై కల్కాజీ నివాసి కేఎస్ దుగ్గల్ గోవింద్పురి ఎస్హెచ్ఓకు ఫిర్యాదు చేశారు. సౌత్-ఈస్ట్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్ కుమార్పై వెంటనే చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కల్కాజీ నుంచి ఎమ్మెల్యేగా అతిషి పోటీ చేస్తున్నారు. ఆమెకు పోటీగా బీజేపీ తరపున రమేష్ బిధూరి, కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా బరిలో ఉన్నారు.
Read Also: Harish Rao: కౌశిక్ రెడ్డి మీద 28 కేసులు పెట్టింది ఎవరు?
అయితే, ఢిల్లీ సీఎం అతిషి ఈరోజు (మంగళవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. వాస్తవానికి సోమవారం నాడే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా.. భారీ ర్యాలీగా వెళ్లడంతో సమయం అయిపోయింది. దీంతో ఆమె నామినేషన్ వేయకుండా వెనుదిరిగారు. ఇవాళ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉందని ఆప్ వర్గాలు పేర్కొ్న్నాయి. నామినేషన్ వేసేందుకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంటుంది. కేజ్రీవాల్తో కలిసి అతిషి ఈసీ కార్యాలయానికి వెళ్లారు. కానీ సమయం దాటిపోవడంతో నామినేషన్ దాఖలు చేయలేకపోయారు.
తాజావార్తలు
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!