Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Former Minister Harish Rao Expressed His Happiness That Mla Kaushik Reddy Got Bail

Harish Rao: కౌశిక్ రెడ్డి మీద 28 కేసులు పెట్టింది ఎవరు?

NTV Telugu Twitter
Published Date :January 14, 2025 , 11:08 am
By RAMAKRISHNA KENCHE
  • కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల హరీశ్ రావు హర్షం
  • మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి
  • రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపాటు పనికి రాదన్న హరీశ్
  • బెయిల్ మంజూరుపై సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేసిన బీఆర్ఎస్ నేత
Harish Rao: కౌశిక్ రెడ్డి మీద 28 కేసులు పెట్టింది ఎవరు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కోకాపేటలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. “డీజీపీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపాటు పనిచేయదు. బెయిలబుల్ సెక్షన్స్ లో అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణం. ఇలాంటి కేసుల్లో నాయకులు చెబితే వినడం కాదు, చట్టాలకు లోబడి పని చేయాలి. బెయిలబుల్ కేసులు అని తెలిసి రాత్రంతా ఇబ్బంది పెట్టారు. బెయిలబుల్ సెక్షన్లకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. కానీ కావాలని పండుగ పూట డెకాయిట్ నో, టెర్రరిస్ట్ నో అరెస్ట్ చేసినట్టు పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్లి అరెస్టు చేయడం దుర్మార్గం. పొలిటికల్ మోటివ్ కేసుల్లో ఎలా వ్యవహరించాలో అనేదానిపై పోలీసులకు డైరెక్షన్ ఇవ్వాలని డీజీపీని కోరుతున్నా.
ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పండుగ అని కూడా చూడకుండా అరెస్టులు చేయడం మానుకోవాలని సూచిస్తున్నా. కౌశిక్ రెడ్డి మీద 28 కేసులు ఉన్నాయి. అరెస్టు చేయాలని అంటున్నారు. ఎవరు పెట్టారు కేసులు. రేవంత్ రెడ్డి రాకముందు కౌశిక్ రెడ్డి మీద ఒక్క కేసు కూడా లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కౌశిక్ రెడ్డి పై అక్రమ కేసులు బనాయించింది మీరు కాదా. 28 కేసులు మీరు పెట్టినవే కదా.” అని ప్రశ్నించారు.

ప్రశ్నించడంలో తప్పేముంది?
కలెక్టర్ ఆహ్వానం మేరకు కౌశిక్ రెడ్డి మీటింగ్‌కు వెళ్లారని.. పిలవని పేరంటానికి ఆయన వెళ్లలేదని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. “మీటింగ్లో సభ్యుడిగా నువ్వే పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని ప్రశ్నించాడు. ఇందులో తప్పేముంది. ఒక కౌశిక్ రెడ్డి కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. పార్టీ మారిన పదిమంది శాసనసభ్యులను ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉంటారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచి, బీఆర్‌ఎస్‌ పార్టీ బట్టలిప్పుతా అని సంజయ్ అంటే ఎలా ఊరుకుంటారు? నువ్వే పార్టీ తరుఫున మాట్లాడుతున్నామని అడిగారు. ఇలా ప్రశ్నించడంలో కౌశిక్ రెడ్డి తప్పేం లేదు. దీనికి మూడు కేసులు పెడతారా? ఒక సంఘటన మీద ముగ్గురు వేర్వేరు ఫిర్యాదులు తీసుకుని కేసులు పెడతారా. మీ కక్ష సాధింపు చర్యలకు ఇది నిదర్శనం కాదా? ఒకే కేసులో మూడు ఎఫ్‌ఐఆర్‌లు పెట్టి, రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టడం కక్ష సాధింపే కదా? రేవంత్ రెడ్డి ప్రోత్బలంతో రాజకీయ కుట్రలో భాగంగా పెట్టిన కేసులు ఇవి. ఒక్కరోజైనా కౌశిక్ రెడ్డిని జైల్లో పెట్టాలని పగా, ప్రతికారంతో, కుట్రతో చేసిన అరెస్టే తప్ప మరొకటి కాదు. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. కౌశిక్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషం. ఇటువంటి చర్యలు ఇప్పటికైనా మానుకోవాలని డిజిపి గారిని అప్పీల్ చేస్తున్నాను.” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదో రాజకీయ కక్ష సాధింపు చర్య?
పండుగ పూట పోలీసులను కూడా ఇబ్బందులు పెట్టడం, టెన్షన్ పెట్టడం సరికాదని హరీశ్ రావు అన్నారు. “మీ కింది స్థాయి పోలీసులను, అధికారులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యమంత్రి చెప్పాడని ఈ రకంగా అక్రమ అరెస్టులు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. సంజయ్ గారు కౌశిక్ రెడ్డి ని కూడా నెట్టారు ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయలేదు. కౌశిక్ రెడ్డి మీదనే ఎందుకు కేసు నమోదు చేశారు. మీ పక్షపాత వైఖరి స్పష్టంగా కనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి ఏడాది పాలన పగా, ప్రతీకారంతోనే కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి, పోలీసులు చేయాల్సిన పని రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటం. పోలీసులు తన పని తాను చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీనిస్తున్నాయి. 23% క్రైమ్ రేట్ పెరిగింది. ఎన్‌సీఆర్‌బీ (NCRB) రిపోర్టు ప్రకారం హైదరాబాద్ ఎల్లో జోన్ లో ఉంది. ఇదే పద్ధతి కొనసాగితే హైదరాబాద్ రెడ్ జోన్లకు వెళ్లే ప్రమాదముంది. పెట్టుబడులు రాకుండా పోయే ప్రమాదం ఉంది. హోం మంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారే ఉండి తన బాధ్యతలు నిర్వర్తించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కక్షపూరిత రాజకీయాలు మానుకొని పరిపాలన మీ దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి, వారి ప్రభుత్వానికి హితవు పలుకుతున్నాం. మంత్రులు, మీడియా ముందు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తానని బహిరంగంగా సంజయ్ ప్రకటించారు. స్పీకర్ గారు సంజయ్ గారి మీద చర్యలు తీసుకోవాలి. తక్షణమే సంజయ్ ని అనర్హుడిగా ప్రకటించే బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది.” అని ఆయన తెలిపారు.

వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి..
చోర్ ఉల్టా కొత్వాల్ కే డాంటి అన్నట్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలంటున్నారని.. చర్యలు తీసుకోవాల్సింది పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల పైన అని మాజీ మంత్రి స్పష్టం చేశారు. “కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా పార్టీ మారిండు, పార్టీలోకి తీసుకోవద్దని చెబుతున్నాడు కదా. ఇంతకంటే స్పీకర్ గారికి ఆధారాలు ఏం కావాలి. స్పీకర్ తక్షణమే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఫిరాయింపుల విషయంలో బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టులో అనర్హత పిటిషన్ పెండింగ్లో ఉండడం ఆలస్యం అవుతుంది కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్లాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. త్వరలోనే సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వస్తాయి. న్యాయం నిలబడుతుంది. అనర్హత వేటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పడుతుంది. నిజాయతీ ఉంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచి సంజయ్ మాట్లాడాలి.” అని హరీశ్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS Party
  • BRS Protests
  • Congress government
  • Former minister Harish Rao
  • harish rao

తాజావార్తలు

  • TDP: జనంలోకి టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు.. అంతర్మధనం స్టార్ట్..?

  • Zee5 : విరాటపాలెం వివాదంపై జీ5 క్లారిటీ..

  • Off The Record: ఆ భార్య, భర్తల మధ్య పొలిటికల్ గేమ్..?.. చిత్ర విచిత్రంగా ఎస్‌.కోట రాజకీయం..

  • Donald Trump: యూఎస్ సుప్రీంకోర్టులో ట్రంప్‌కు భారీ విజయం.. “జన్మతా పౌరసత్వం”పై అనుకూలంగా తీర్పు..

  • TG EAPCET 2025: ఎప్ సెట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ విధానం లో మార్పులు.. విద్యార్థులకు మరింత ప్రయోజనం

ట్రెండింగ్‌

  • Viral Video: ఇది కాకి కాదు మేధావి.. ఈ వీడియో చూశాక దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..!

  • Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!

  • BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

  • Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

  • Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions