Canada: ఖలిస్తాన్ ఆందోళనలపై రాజకీయాలను ప్రభావితం చేయాలని భారత్ ప్రయత్నిస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: కెనడా మరోసారి భారత్పై నిందలు మోపింది. ఇప్పటికే ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ హత్యలో ఇప్పటికే ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసినట్లు కెనడా ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే కెనడా రాజకీయాలను ప్రభావితం చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆ దేశం మరోసారి ఆరోపించింది. ముఖ్యంగా ఖలిస్తాన్ నిరసనల నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు భారత్ జోక్యం చేసుకుంటుందని చెప్పింది.
గత రెండు ఎన్నికల్లో ఇలాగే విదేశీ జోక్యానికి సంబంధించిన ఆధారాలు ఉన్నట్లుగా పేర్కొంది. భారత్ కెనడాలో తమకు అనుకూలంగా ఉండే అభ్యర్థుల్ని ఎన్నుకునేందుకు యత్నిస్తోందని నివేదిక ఆరోపించింది. అయితే, భారత్ ఈ ఆరోపణల్ని నిరాధారమైనవని తిరస్కరించింది. ఇంతే కాకుండా న్యూఢిల్లీ అంతర్గత విషయాల్లో ఒట్టవా జోక్యం చేసుకోవడమే ప్రధాన సమస్య అని చెప్పింది. భారత్తో పాటు చైనా కూడా కెనడా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుందని శుక్రవారం ప్రచురించిన నివేదిక పేర్కొంది.
Also Read
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్కు త్రిషా కృష్ణన్.. విజయ్తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- BRICS Summit 2026: మోడీ-జిన్పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
Read Also: Shubman Gill : టీమిండియా మహిళ క్రికెటర్ కు బ్యాటింగ్ చిట్కాలు చెబుతున్న గిల్.. వైరల్ వీడియో..
కెనడాకు చెందిన ప్రాక్సీలతో సహా భారత్ అధికారులు కెనడియన్ కమ్యూనిటీలను, రాజకీయ నాయకులును ప్రభావితం చేసే అనేక రకాల కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారని, ఈ కార్యకలాపాల్లో విదేశీ జోక్యం ఉందని, ఇది కెనడాలో భారత అనుకూల ప్రయోజనాలను లక్ష్యంగా పెట్టుకుందని, ప్రత్యేకించి కెనడా బెస్డ్ ఖలిస్తాన్ మద్దతుదారుల గురించి భారత ప్రభుత్వం ఎలా గ్రహిస్తుంది అని నివేదిక భారత్ గురించి ప్రస్తావించింది. కెనడాలోని కొంతమంది భారత్ వ్యతిరేకతకు పాల్పడుతున్నారని భారత్ భావిస్తోందని, ఇది భారతదేశ స్థిరత్వం, జాతీయ భద్రతకు ముప్పుగా చూస్తోందని నివేదిక చెప్పింది. ఖలిస్తాన్ వేర్పాటువాదంతో జతకట్టే వారిని దేశానికి “విద్రోహ ముప్పు”గా భారతదేశం చూస్తుందని నివేదిక ధ్వజమెత్తింది.
2019, 2021 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి విదేశీ జోక్యం కోసం భారత్ దిశానిర్దేశం చేసిందని, భారత ప్రాక్సీ ఏజెంట్లు ప్రజాస్వామ్య ప్రక్రియల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించి ఉండొచ్చని, వివిధ కెనడియన్ రాజకీయ నాయకులకు రహస్యంగా ఆర్థిక సహాయాన్ని అందించి ఉండిచ్చని పేర్కొంది. 194 పేజీల నివేదికలో భారత్ని 43 సార్లు ప్రస్తావించారు. భారత్తో పాటు కెనడాలో రష్యా, పాకిస్తాన్, ఇరాన్ వంటి దేశాలు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని గతంలో కెనడా పేర్కొంది. అయితే, భారత్ వీటిని తిరస్కరించింది. నిజానికి కెనడా వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు, భారత వ్యతిరేక శక్తులకు కేంద్రంగా మారిపోయిందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!