Gujarat Elections: గుజరాత్ పీఠం బీజేపీదే.. హిమాచల్లో కూడా కాషాయమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP to make clean sweep in Gujarat, Himachal Pradesh elections: లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమే గడువు ఉంది. మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందరి చూపు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజల నాడిని తెలుపుతాయని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. గుజరాత్ లో రెండు విడతలుగా.. హిమాచల్ ప్రదేశ్ లో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
కాగా.. మరోసారి గుజరాత్ రాష్ట్రంలో మరోసారి బీజేపీ స్వీప్ చేయనుందని.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాషాయ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఏబీపీ సీ ఓటర్ సర్వేలో వెల్లడైంది. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. పంజాబ్ ఎన్నికల గెలుపును గుజరాత్ లో పునరావృతం చేయాలని ఆప్ భావిస్తోంది. ఇదిలా ఉంటే గతంతో పోలిస్తే ఆప్ భారీగా పుంజుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆప్ 12 నుంచి 17 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపే అధికారంలోకి వస్తుందని సర్వే స్పష్టం చేసింది.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
Read Also: Kerala Boys Prank: ప్రాంక్ పేరుతో వెకిలి చేష్టలు.. బెండు తీసిన పోలీసులు
ఎన్నికల ఫలితాలు-ప్రీ పోల్ సర్వే..
సర్వే ప్రకారం గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 182 సీట్లలో బీజేపీకి 131 నుంచి 139 స్థానాలు వస్తాయని తేలింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి 31 నుంచి 39 వరకు ఆప్ కు 13-17 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 45.4 శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని.. కాంగ్రెస్ కు 29.1 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 20.2 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. గతంలో కేవలం 0 శాతానికే పరిమితమైన ఆప్ ఓట్ షేర్ గణనీయంగా పెరగనుంది. గతంలో పోలిస్తే బీజేపీ 3.7 శాతం ఓట్ షేర్ తగ్గనుందని.. కాంగ్రెస్ పార్టీకి 12.4 శాతం ఓట్ షేర్ తగ్గుతుందని సర్వేలో తేలింది.
హిమాచల్ ప్రదేశ్ లో ఒపీనియన్ పోల్ ప్రకారం మొత్తం 68 సీట్లలో బీజేపీకి 37 నుంచి 45 స్థానాలు వస్తాయని.. కాంగ్రెస్ పార్టీకి 21-29 సీట్లు రావచ్చని సర్వే తేల్చింది. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ప్రజలు మూడ్ మారే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!