Bulldozer Drive: ఢిల్లీలో టెన్షన్…. మొదలైన ఆక్రమణల కూల్చివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో మరోసారి టెన్షన్ నెలకొంది. మరోసారి నార్త్, సౌత్ ఢిల్లీ మున్సిపాలిటీల అధికారులు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. బుల్డోజర్లతో ఆక్రమణలను తొలగిస్తున్నారు. నిన్న ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారి తీసింది. పెద్ద ఎత్తున స్థానికులు, ప్రజాప్రతినిధులు యాంటీ ఎన్ క్రోచ్మెంట్ డ్రైవ్ కు వ్యతిరేఖంగా ఆందోళనలు చేశారు. షాహీన్ బాగ్ లో ఆక్రమణల కూల్చివేతపై సీపీఐ సుప్రీం కోర్ట్ లో పిల్ దాఖలు చేసింది. అయితే ఈ పిల్ పై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణ తొలగింపులపై జోక్యం చేసుకోలేదు.
రెండో రోజు కూడా నార్త్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుల్డోజర్లతో ఆక్రమణలను కూల్చి వేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆక్రమణలను తొలగిస్తున్నారు. షాహీన్ బాగ్, మంగోల్ పురి, న్యూ ఫ్రెండ్స్ కాలనీల్లో బుల్డోజర్ డ్రైవ్ చేపట్టారు అధికారులు. స్థానికుల నుంచి వ్యతిరేఖత వచ్చినా కూడా అధికారులు వెనక్కి తగ్గడం లేదు. ఢిల్లీ పోలీసుల, పారామిలటరీ బలగాల భద్రతలో ఆక్రమణలు కూల్చివేస్తున్నారు. నిన్న జరిగిన కూల్చివేతలను అడ్డుకున్న ఆప్ ఎమ్మెల్యే అమనుల్లా ఖాన్ ను అరెస్ట్ చేశారు. తాజాగా ఈరోజు ఆక్రమణలను అడ్డుకున్న ఆప్ ఎమ్మెల్యే ముఖేష్ అహ్లావత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 13 వరకు అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు టార్గెట్ గా పెట్టుకున్నాయి.
Also Read
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
- Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
- Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
ఇటీవల హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా ఊరేగింపు జరుగుతున్న క్రమంలో జహంగీర్ పురిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో పోలీసులతో పాటు స్థానికులు గాయపడ్డారు. ఈ ఘర్షణలకు కారణమైనవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆందోళకారులు అక్రమ నిర్మాణాలపై ఉంటూ రాళ్ల దాడి జరిగిందని తేలడంతో… ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జహంగీర్ పురి ఏరియాలో ఆక్రమణలను తొలగించేందుకు బుల్డోజర్ డ్రైవ్ చేపట్టింది. ఆ సమయంలో కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేఖిస్తూ… సుప్రీం కోర్ట్ లో పిల్ దాఖలు చేశారు. జహంగీర్ పురి కూల్చివేతలపై సుప్రీం కోర్ట్ స్టే విధించింది. అంతకుముందు మధ్య ప్రదేశ్ ఖార్గోన్ నగరంలో రామనవమి వేడుకల ఊరేగింపు సమయంలో కూడా ఇలాగే మతకలహాలు జరిగాయి. దీంతో అక్కడి శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ నగరంలోని అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేశారు.
తాజావార్తలు
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
-
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
-
Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
-
Virat Kohli: ఇంగ్లాండ్కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే ‘కోచ్’గా మారిన కోహ్లీ!
-
Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..