Union Budget 2026: రేపే బడ్జెట్.. ఇంతకీ స్టాక్ మార్కెట్లు పని చేస్తాయా..?
- రేపు భారతదేశ బడ్జెట్ 2026-27..
- బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
- ఆదివారం నాడు స్టాక్ మార్కెట్లు పని చేస్తాయా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2026: ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం భారతదేశ బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోతుంది. సాధారణంగా ఫిబ్రవరి 1 ఆదివారం అంటే సెలవు రోజు.. కానీ, ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అదే రోజు బడ్జెట్ 2026ను ప్రకటిస్తున్నందున, స్టాక్ మార్కెట్లు పని చేయాలని నిర్ణయించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రేపు (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ ప్రసంగం చేస్తారు. ఆ తర్వాత బడ్జెట్ పత్రాలను లోక్సభ, రాజ్యసభలో ప్రవేశ పెడతారు. ఇన్వెస్టర్లు బడ్జెట్ నిర్ణయాలకు అనుగుణంగా వెంటనే ట్రేడింగ్ చేసుకునే ఛాన్స్ కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)తో పాటు కమోడిటీ మార్కెట్లు కూడా ఆదివారం రోజు పూర్తి స్థాయిలో ట్రేడింగ్ నిర్వహిస్తున్నాయి. ఈక్విటీలు, డెరివేటివ్స్, కమోడిటీల ట్రేడింగ్ జరుగుతున్నాయి.
Read Also: Union Budget 2026: జీఎస్టీ మినహాయింపులు.. ఆటో రంగానికి బూస్ట్..
Also Read
- Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
- El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
- Delhi: ఐబీ ఉద్యోగి అంకిత్ శర్మ హత్య కేసులో సంచలన తీర్పు.. మాజీ ఆప్ నేత తాహిర్ హుస్సేన్కు జీవిత ఖైదు
- PM-KISAN Scheme: రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. మరో ఐదేళ్లు పీఎం-కిసాన్
ట్రేడింగ్ సమయాలు:
* ప్రీ-ఓపెన్ సెషన్: ఉదయం 9:00 నుంచి 9:08 వరకు..
* నార్మల్ ట్రేడింగ్: ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30..
* బ్లాక్ డీల్ సెషన్ 1: ఉదయం 8:45 నుంచి 9:00..
* బ్లాక్ డీల్ సెషన్ 2: మధ్యాహ్నం 2:05 నుంచి 2:20..
* IPO, ఇతర ప్రత్యేక సెషన్లు: ఉదయం 9:00 నుంచి 9:45..
* మార్కెట్ ముగిసిన తర్వాత సెషన్: మధ్యాహ్నం 3:40 నుంచి సాయంత్రం 4:00 వరకు.
Read Also: Budget 2026: కొత్త పన్ను, కస్టమ్స్ రేట్లు తగ్గింపు, టీడీఎస్ సరళీకరణ.. బడ్జెట్లో కీలక మార్పులు
* సెటిల్మెంట్: ఆదివారం రోజు మీరు చేసే ట్రేడింగ్ సెటిల్మెంట్ సోమవారం (ఫిబ్రవరి 2) నాడు మాత్రమే జరుగుతుంది. ఆదివారం హాలీడే కాబట్టి ఆరోజు సెటిల్మెంట్ జరగదు.
* డబ్బు విత్ డ్రా: ఆదివారం మీరు డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, కానీ ఆ డబ్బు మాత్రం సోమవారం నాడే మీ బ్యాంకు అకౌంట్ లో జమ అవుతుంది.
* షేర్ల అమ్మకం: జనవరి 30వ తేదీ శుక్రవారం నాడు కొన్న షేర్లను ఆదివారం అమ్మడానికి వీలు లేదు.. వాటిని సోమవారం నుంచి అమ్ముకునే అవకాశం ఉంటుంది.
* మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) కూడా ఆదివారం నాడు పని చేస్తుంది. బడ్జెట్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లతో ట్రేడింగ్ కొనసాగనుందని ఎంసీఎక్స్ వెల్లడించింది.
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
-
Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
-
Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
-
Gold Loan Demand: గోల్డ్ లోన్ల జోరు.. మేలో కొత్త రికార్డు.. ఆర్బీఐ వార్నింగ్..
-
Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!