Bengaluru: ఎయిర్పోర్ట్ దూరంగా ఉందని బాంబు బెదిరింపు.. విద్యార్థి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb threat to Bangalore airport.. Engineering student arrested: బెంగళూర్ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చేస్తానని బెదిరిస్తూ ట్వీట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల్లో ఆందోళన పెంచేలా ట్వీట్ చేసినందుకు బెంగళూర్ ఈశాన్య క్రైమ్ పోలీసులు గురువారం 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడు వైభవ్ గణేష్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బెంగళూర్ లోని దక్షిణ ప్రాంతంలోని కుడ్లు గేట్ లో నివాసం ఉంటున్నాడని పోలీసులు వెల్లడించారు.
Read Also: Pakistan: ఇస్లామాబాద్లో ఆత్మాహుతి దాడి…
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
డిసెంబర్ 10న నిందితుడు తన ట్విట్టర్ ఖాతాల నుంచి బెదిరింపులకు పాల్పడ్డాడు. నేను బెంగళూర్ విమానాశ్రయంపై బాంబు వేస్తానని..దీంతో వారు నగరానికి దగ్గరగా దాన్ని మళ్లీ నిర్మించవచ్చని ట్వీట్ చేశారు. కొద్ది సేపటికి దీన్ని తొలగించారు. అయితే కొద్ది సమయంలోనే ఇది వైరల్ గా మారింది. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు నిందితుడి ట్వీట్టర్ ఖాతా ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ 505(ప్రజాదుర్వినియోగానికి దారి తీసే ప్రకటన), 507( అజ్ఞాతంగా నేరపూరిత బెదిరింపుకు పాల్పడటం) చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ బెదిరింపులపై డిసెంబర్ 12 కెంపేగౌడ విమానాశ్రయ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
ఫిర్యాదు మేరకు ఈశాన్య డివిజన్ పోలీసులు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి, సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి వైభవ్ ని పట్టుకున్నారు. ట్వీట్ చేసిన అతడి మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే విచారణ సమయంలో.. నిందితుడు తన నివాసం నుంచి ఎయిర్ పోర్టుకు ప్రయాణించడం కష్టంగా ఉందని.. చాలా దూరంలో ఉందనే నిరాశతోనే ఇలా ట్వీట్ చేశానని ఒప్పుకున్నాడు. ప్రజలు ఇలాంటి బెదిరింపులకు దూరంగా ఉండాలని పోలీసులు కోరారు. బాంబు బెదిరింపు అనేది ఒక జోక్ కాదని..దయచేసి ఇలాంటివి చేయవద్దని సూచించారు. బెంగళూరు విమానాశ్రయం దేవనహళ్లిలో ఉంది, ఇది నగరం మధ్య నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానాశ్రయం నగర శివార్లలో ఉన్నందుకు చాలా మంది ప్రయాణికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..