Bengaluru: ఎయిర్పోర్ట్ దూరంగా ఉందని బాంబు బెదిరింపు.. విద్యార్థి అరెస్ట్
Bomb threat to Bangalore airport.. Engineering student arrested: బెంగళూర్ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చేస్తానని బెదిరిస్తూ ట్వీట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల్లో ఆందోళన పెంచేలా ట్వీట్ చేసినందుకు బెంగళూర్ ఈశాన్య క్రైమ్ పోలీసులు గురువారం 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడు వైభవ్ గణేష్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బెంగళూర్ లోని దక్షిణ ప్రాంతంలోని కుడ్లు గేట్ లో నివాసం ఉంటున్నాడని పోలీసులు వెల్లడించారు.
Read Also: Pakistan: ఇస్లామాబాద్లో ఆత్మాహుతి దాడి…
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
డిసెంబర్ 10న నిందితుడు తన ట్విట్టర్ ఖాతాల నుంచి బెదిరింపులకు పాల్పడ్డాడు. నేను బెంగళూర్ విమానాశ్రయంపై బాంబు వేస్తానని..దీంతో వారు నగరానికి దగ్గరగా దాన్ని మళ్లీ నిర్మించవచ్చని ట్వీట్ చేశారు. కొద్ది సేపటికి దీన్ని తొలగించారు. అయితే కొద్ది సమయంలోనే ఇది వైరల్ గా మారింది. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు నిందితుడి ట్వీట్టర్ ఖాతా ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ 505(ప్రజాదుర్వినియోగానికి దారి తీసే ప్రకటన), 507( అజ్ఞాతంగా నేరపూరిత బెదిరింపుకు పాల్పడటం) చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ బెదిరింపులపై డిసెంబర్ 12 కెంపేగౌడ విమానాశ్రయ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
ఫిర్యాదు మేరకు ఈశాన్య డివిజన్ పోలీసులు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి, సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి వైభవ్ ని పట్టుకున్నారు. ట్వీట్ చేసిన అతడి మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే విచారణ సమయంలో.. నిందితుడు తన నివాసం నుంచి ఎయిర్ పోర్టుకు ప్రయాణించడం కష్టంగా ఉందని.. చాలా దూరంలో ఉందనే నిరాశతోనే ఇలా ట్వీట్ చేశానని ఒప్పుకున్నాడు. ప్రజలు ఇలాంటి బెదిరింపులకు దూరంగా ఉండాలని పోలీసులు కోరారు. బాంబు బెదిరింపు అనేది ఒక జోక్ కాదని..దయచేసి ఇలాంటివి చేయవద్దని సూచించారు. బెంగళూరు విమానాశ్రయం దేవనహళ్లిలో ఉంది, ఇది నగరం మధ్య నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానాశ్రయం నగర శివార్లలో ఉన్నందుకు చాలా మంది ప్రయాణికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
DC Vs RCB: చెత్త రికార్డు మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. 6 ఓవర్లలోపే చేతులెత్తేశారుగా..
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!