Bihar: బీహార్లో పడవ బోల్తా.. ఏడుగురు మృతి
Boat capsizes in Bihar’s Katihar: బీహార్ రాష్ట్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ విషాదకర సంఘటన ఆదివారం రోజున కతిహార్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 10 మంది ఉంటే ఏడుగురు మరణించారు. మరో ముగ్గురు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారు. పడవలో ఉన్నవారంతా రైతులే అని తెలుస్తోంది. మరణించిన వారికి సీఎం నితీష్ కుమార్ రూ.4 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
ఆదివారం బరారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్ఘియా గ్రామసమీపంలోని బరాండీ నదిలో బోటు అకాస్మత్తుగా బోల్తా పడింది. ఈతగాళ్లు మొత్తం ఏడుగురు మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. స్థానికులతో పాటు ఎస్డీఆర్ఎఫ్ టీములు చనిపోయినవారి మృతదేహాలను నది నుంచి వెలికితీశారు. పడవలో ఉన్న వారంతా మర్గియా గ్రామానికి చెందిన పాశ్వాన్ తోలా వాసులుగా గుర్తించారు.
Also Read
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
Read Also: Infosys: ఐటీ ఉద్యోగులకు మరోసారి నిరాశ.. కొత్త ఉద్యోగుల ఆన్బోర్డింగ్ వాయిదా వేసిన ఇన్ఫోసిస్
పడవలో ప్రయాణిస్తున్నవారంతా తమ పొలాల్లో పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. రైతులు తమ పొలం నుంచి వరిని పడవల్లో తెచ్చుకుంటున్నారు. పొలాల నుంచి గ్రామానికి వేరే మార్గం లేకపోవడంతో పడవల ద్వారానే పంటను తీసుకుస్తున్నారని.. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు.
అంతకుముందు రోజు శనివారం సీఎం నితీష్ కుమార్ కి ప్రమాదం తప్పింది. గంగా నదిలో స్టీమర్ లో ప్రయాణిస్తున్న సందర్భంలో స్టీమర్ పిల్లర్ ని ఢీకొట్టింది. దీంతో నితీష్ కుమార్ కు స్వల్పగాయాలు అయ్యాయి. ఛఠ్ పూజ సందర్భంగా గంగా నదిలో ఘాట్లను సందర్శించే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రతీ ఏడాది ఛఠ్ పూజ సందర్భంగా గంగానదిని సందర్శిస్తుంటారు సీఎం నితీష్ కుమార్. దీపావళి జరిగిన 6 రోజుల తర్వాత ఛఠ్ పూజలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 30 నుంచి ఈ పూజలు ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!