BJP: బీజేపీ ఓటు షేర్ పదిలం.. జేడీఎస్కు గండి కొట్టిన కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. 224 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 113ని దాటి ఏకంగా 136 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. బీజేపీ 64, జేడీఎస్ 20 స్థానాలకే పరిమితం అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులుగా చేస్తూ హంగ్ అసెంబ్లీకి తావు లేకుండా కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఎన్నాళ్ల నుంచో విజయం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ గెలుపు కొత్త ఉత్తేజాన్ని తీసుకువచ్చింది. 2024 లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు శక్తినిచ్చింది.
Read Also: Kamal Haasan: కాంగ్రెస్ విజయం, రాహుల్ గాంధీ గురించి కమల్ హాసన్ ఏమన్నారంటే..?
Also Read
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ఇదిలా ఉంటే బీజేపీ ఓడిపోయింది, కానీ బీజేపీకి ఉండే స్ట్రాంగ్ ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరలేదు. 2018 ఎన్నికల్లో ఎంత శాతం ఓట్ షేర్ వచ్చిందో..2023 ఎన్నికల్లో కూడా దాదాపుగా అంతే శాతం ఓట్ షేర్ సాధించింది. గడిచిన రెండు ఎన్నికల్లో 36 శాతం ఓట్ షేర్ సాధించింది బీజేపీ. అయితే సీట్లలో మాత్రం భారీగా కోతపడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 36 శాతం ఓట్ షేర్ తో 104 స్థానాలను గెలుచుకుంటే.. ప్రస్తుతం అదే 36 శాతంతో కేవలం 64 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే 2018లో కాంగ్రెస్ 38 శాతం ఓట్ షేర్ తో 80 స్థానాలు సాధిస్తే.. 2023లో 43 శాతం ఓట్ షేర్ తో ఏకంగా 136 స్థానాలను కైవసం చేసుకుంది. ముఖ్యంగా జేడీఎస్ ఓట్ షేర్ కాంగ్రెస్ పార్టీకి మళ్లినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో 18 శాతంతో 37 స్థానాలను జేడీఎస్ గెలుచుకుంటే.. ఈసారి 13 శాతం ఓట్ షేర్ తో 20 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. దీన్ని బట్టి చూస్తే జేడీఎస్ పార్టీ ఓట్ షేర్ కు కాంగ్రెస్ గండికొట్టింది.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!