Congress: బీజేపీకి అత్యంత విశ్వసనీయ నేత అసదుద్దీన్ ఓవైసీ.. “ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ” వ్యాఖ్యలపై కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ కీలుబొమ్మ అని ఇటీవల ఓవైసీ విమర్శించారు. ఈ విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత, బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. బీజేపీ పోటీని సులభతరం చేయడానికి అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ఓట్లను చీల్చుతున్నాడని అందరికి తెలుసని ఆయన ఆరోపించారు. ఓట్లను కోయడంలో అసదుద్దీన్ ప్రసిద్ధి చెందారని, ఈ విషయం దేశం మొత్తానికి తెలుసని, బీజేపీ నుంచి లంచాలు, డబ్బులు తీసుకుంటున్నాడంటూ సంచలన విమర్శలు చేశారు.
బెంగాల్లోని ముర్షిదాబాద్లో మంగళవారం మీడియాతో పాల్పడుతూ అధిర్ రంజన్ చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు. అవినీతిపై యుద్ధం చేస్తామని చెబుతున్న బీజేపీ ముందు తమ పరిస్థితిని చూసుకోవాలని, వారి పార్టీలో అవినీతి కంపును పసిగట్టాలని అన్నారు. తెలంగాణలో ఇప్పటికే మార్పు తుఫాను మొదలైందని, దీని నుంచి బయటపడేందుకు బీజేపీ తమ అత్యంత విశ్వసనీయ నేత అసదుద్దీన్ ఓవైసీని ఆశ్రయించిందని ఆరోపించారు.
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
Read Also: Bihar: “ఇలాంటివి కొత్త కాదు”.. పోలీస్ అధికారి హత్యపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణనకు మద్దతిస్తుండటంతో హిందూ ఓట్లను ఏకం చేసి హిందుత్వం పేరుతో ఎన్నికల్లో పోటీ చేయాలని కలలు కన్న ప్రధాని నరేంద్రమోడీకి అడ్డంకిగా మారిందని ఆయన అన్నారు. హిందూ సమాజంలో వివక్ష ఉందని రాహుల్ గాంధీ చెబుతున్నారని, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల స్థితిగతులు తెలుసుకునే ఉద్దేశం మోదీకి లేదని, ఆయన మతతత్వ రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారని అన్నారు. కులగణన ఆధారంగా అన్ని ప్రభుత్వ పథకాలు ప్లాన్ చేయాలని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని జాయ్నగర్ లో స్థానిక టీఎంసీ నాయకుడి హత్యపై మాట్లాడుతూ.. 24 గంటలు గడిచినా, హంతకుడు ఎవరో తెలియలేదని ఎద్దేవా చేశారు. రామ మందిరం బీజేపీకి ప్రస్తుతం ఎన్నికల అంశంగా మారిందని, సరిహద్దుల్లో కూడా రామ మందిరంగ గురించే మోడీ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
-
Mirzapur The Movie : మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ విడుదల
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!