BJP: ప్రధాని మోడీని ‘‘అంతం’’ చేయడమే లక్ష్యమా..? కాంగ్రెస్ ‘‘ఓట్ చోరీ’’ ర్యాలీలో విద్వేష వ్యాఖ్యలు..
- ప్రధాని మోడీని ‘‘అంతం’’ చేయడమే లక్ష్యమా..?
- కాంగ్రెస్ ‘‘ఓట్ చోరీ’’ ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు..
- సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత పూనావాలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ‘‘ ఓట్ చోరీ’’పై భారీ ర్యాలీకి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అయితే, ర్యాలీ వేదిక వద్ద ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి పలువురు కార్యకర్తలు విద్వేష వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ప్రధాని మోడీని ‘‘అంతం చేయడమే’’ కాంగ్రెస్ అసలు లక్ష్యంగా ఉందని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీలో ఆదివారం కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీ వేదిక వద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు వివాదాస్పద నినాదాలు చేసిన తర్వాత, బీజేపీ నుంచి ఈ ఆరోపణలు వచ్చాయి. “మోదీ, తేరీ కబర్ ఖుదేగీ” అనే హింసాత్మక నినాదాలు చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.
Read Also: Lionel Messi: “మెస్సీ” ఈవెంట్ ఆర్గనైజర్ అరెస్ట్.. 14 రోజుల పోలీస్ కస్టడీ..
Also Read
ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన నినాదాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆయన పాలన ముగిసిపోతుందని అందులో చెప్పడం కనిపిస్తోంది. ఈ వివాదంపై బీజేపీ నేత, అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘వారి ఎజెండా స్పష్టంగా ఉంది. ఇది ఎస్ఐఆర్ (SIR) గురించి కాదు. ఇది రాజ్యాంగంపై దాడి గురించి… ఎస్ఐఆర్ పేరుతో వారు ప్రధాని మోదీని అంతమొందించాలనుకుంటున్నారా? ఇటీవల రాహుల్ గాంధీ ఈసీఐని కూడా బెదిరించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రధాని మోదీని 150కి పైగా సార్లు దూషించింది’’ అని పూనావాలా ఎక్స్లో ఒక పోస్ట్లో పేర్కొన్నారు.
‘‘వారు ఎన్నికల్లో ఓడిపోయారు, మరియు ఆ బాధ్యతను రాహుల్ గాంధీ తీసుకోవాలని వారు కోరుకోవడం లేదు. కొన్నిసార్లు వారు ఎన్నికల సంఘాన్ని బెదిరిస్తారు, అదే పనిని రాహుల్ గాంధీ చేశారు, ఇప్పుడు వారు ప్రధాని మోదీని చంపాలనుకుంటున్నామని బహిరంగంగా చెప్పారు… అతను కుటుంబాన్ని రాజ్యాంగం కంటే పైస్థానంలో ఉంచాలని, ప్రజాస్వామ్య సంస్థలను అణచివేయాలని, మరియు తమ కుటుంబం దేశం కంటే గొప్పదనే ఆధిపత్య మనస్తత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు’’ అని పూనావాలా ఆరోపించారు.
ఓట్ చోరీ, ఓటర్ల జాబితా సవరణలపై ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను కాంగ్రెస్తో సహా దాని మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా తన ప్రచారాన్ని తీవ్రం చేయడానికి ఆదివారం కాంగ్రెస్ ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్లో భారీ ర్యాలీని నిర్వహిస్తోంది. ఈ భారీ ర్యాలీకి హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, నాయకులు ఢిల్లీకి వచ్చారు.
#WATCH | Delhi: On the Congress mega rally against 'Vote Chori,' BJP's national spokesperson Shehzad Poonawalla says, "This is not about vote-chori… This is not about SIR; it is about saving family and an attack on the Constitution. The manner in which the agenda is now out in… pic.twitter.com/WetPJp3DWA
— ANI (@ANI) December 14, 2025
#WATCH | Delhi: On the Congress mega rally against 'Vote Chori,' BJP spokesperson Pradeep Bhandari says, "In this rally, Congress workers, including members and office-bearers of the women's wing of one of the states, chanted the slogan, 'Modi, teri kabar khudegi'… Previously,… pic.twitter.com/JRanmGkQVi
— ANI (@ANI) December 14, 2025
“MODI TERI KABRA KHUDEGI”, slogans were shouted openly by Congress workers before a rally at Ramlila Maidan.
This is not dissent.
This is a direct threat of violence against the Prime Minister @narendramodi.
Under #RahulGandhi , Congress has sunk into a radical, extremist… pic.twitter.com/4jWQjA0qd8— DrVinushaReddy (@vinushareddyb) December 14, 2025
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!