Lok Sabha Elections: బీజేపీ 305 సీట్లు గెలుస్తుంది.. అమెరికా పొలిటికల్ సైంటిస్ట్ అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికలు తుది దశకు వచ్చాయి. మరో రెండు విడతల్లో దేశంలోని 543 ఎంపీ స్థానాలకు ఎన్నికలు ముగియనున్నాయి. అయితే, ఈ సారి ఎన్నికల్లో మొత్తం అంకెల చుట్టూ తిరుగుతోంది. బీజేపీ స్వయంగా 370 సీట్లు, ఎన్డీయే కూటమి మొత్తంగా 400 కన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ సారి బీజేపీ కేవలం 200 కన్నా తక్కువ స్థానాలకే పరిమితమవుతుంది, ఇండియా కూటమి 300 స్థానాలను కన్నా ఎక్కువ గెలుచుకుని అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇదిలా ఉంటే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 305(+/- 10) గెలుచుకుంటుందని అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్, గ్లోబల్ పొలిటికల్ రిస్క్ కన్సల్టెంట్ ఇయామ్ బ్రెమ్మర్ మంగళవారం జాతీయ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రపంచ రాజకీయ దృక్కోణంలో భారత సార్వత్రిక ఎన్నికలు స్థిరంగా కనిపించే ఏకైక విషయమని, మిగతావన్నీ అమెరికా ఎన్నికలతో సహా సమస్యాత్మకంగా కనిపిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం భౌగోళిక రాజకీయాలు నిశ్చితిలో ఉన్నాయని అన్నారు. ప్రపంచీకరణ కంపెనీలు కోరుకున్న విధంగా జరగడం లేదని చెప్పారు. రాజకీయాలు ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించడం..యుద్ధాలు, యూఎస్-చైనా సంబంధాలు, అమెరికా ఎన్నికలు అన్ని ఇందులో భాగమే అని అన్నారు. ఈ ఒత్తిళ్లు మరింత ప్రతీకూలంగా ఉన్నాయని, వాస్తవానికి రాజకీయంగా స్థిరంగా కనిపించే ఏకైక విషయం భారతదేశ ఎన్నికలే అని, మిగతావన్నీ సమస్యాత్మకంగా ఉన్నాయని చెప్పారు.
Also Read
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
- Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
- Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
Read Also: Virat Kohli: ‘నా కళ్లను మాత్రమే నమ్ముకుంటా’.. విరాట్ సంచలన వ్యాఖ్యలు..
ఏడు దశల్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 295-315 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ 2014లో 282( ఎన్డీయే 336 సీట్లు), 2019లో 303 సీట్లు(ఎన్డీయే కూటమి 353) గెలుచుకుంది. ఇదిలా ఉంటే ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. 2019లో సాధించిన సీట్లకు అటూ ఇటూగా లేదా, దాని కన్నా కొన్ని స్థానాలు ఎక్కువగా బీజేపీ గెలుచుకుంటుందని, ఆ పార్టీ చెప్పినట్లు 370 సీట్లు సాధించలేదని చెప్పారు.
ప్రపంచంలోని పలు దేశాల్లో ఎన్నికలు ఉన్నాయని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ సున్నితమైన ఎన్నికల ప్రక్రియను కలిగి ఉందని బ్రెమ్మర్ ప్రశంసించారు. బలమైన ఆర్థిక పనితీరు, స్థిరమైన సంస్కరణలతో మోడీ మూడోసారి గెలువబోతున్నారని అన్నారు. దశాబ్ధాలుగా భారత్ పనితీరును పలు దేశాలు తక్కువగా చూసినప్పటికీ, ప్రస్తుత అమెరికన్ సీఈఓలు భారత్ వస్తున్నారని, తాము వృద్ధిని చూస్తున్నామని, భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడాన్ని చూశామని, బహుశా 2028 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించొచ్చని ఆయన అన్నారు. మిగిలిన దేశాలతో తన స్నేహాన్ని నిర్వహిచే విషయంలో భారత్ శక్తివంతంగా మారడాన్ని ప్రపంచం చూస్తోందని చెప్పారు.
తాజావార్తలు
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
-
Kia Syros Flex Fuel: 100% ఇథనాల్తోనూ నడుస్తుంది.. కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వచ్చేసింది..
-
Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!