BJP: శ్రద్ధా వాకర్ హత్యపై ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు మౌనంగా ఉంటున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Slams Uddhav Thackeray For Silence On Shraddha Case: శ్రద్ధావాకర్ హత్య రాజకీయ దుమారాన్ని రాజేసింది. ఇటీవల ఢిల్లీ శ్రద్ధా వాకర్ ను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశారు. డెడ్ బాడీని 35 ముక్కులుగా నరికేశాడు. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గాల మధ్య అగ్గిరాజేసింది. శ్రద్ధావాకర్ హత్యపై ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించింది. కొత్త హిందువు అనే భావన తీసుకురావడం ద్వారా ఠాక్రే హిందువులను విభజించాలని చూస్తున్నారని ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్ గురువారం ఆరోపించారు.
Read Also: Pakistan: “పుల్వామా దాడి”కి పాక్ కొత్త ఆర్మీ చీఫ్ కారణం.. భారత్ అంటే నరనరాన వ్యతిరేకతే..
Also Read
- PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
- CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
మరాఠీ ముస్లింకు మద్దతు ఇస్తానని ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు అన్నారని ప్రశ్నించారు ఆశిష్ షెలార్. జైనులు, గుజరాతీలు, నార్త్ ఇండియన్స్ తో ఆయను ఎలాంటి సమస్యలు ఉన్నాయని ప్రశ్నించారు. కేవలం ముస్లిం ఓట్లను పొందేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ముందు ముంబైలో జరిగిన ర్యాలీలో బీజేపీ, ఉద్ధవ్ ఠాక్రేపై ప్రశ్నల వర్షం కురిపించింది.
ముంబై అమ్మాయి శ్రద్ధా వాకర్ అనే అమ్మాయిని అఫ్తాబ్ హత్య చేసి ముక్కలుగా నరికాడు. డిసెంబర్ 22, 2020న శ్రద్ధా వాకర్ మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో మహారాష్ట్రలో శివసేన, మహావికాస్ అఘాఢి ప్రభుత్వం ఉంది. ఆ సమయంలో శ్రద్ధా తనను అఫ్తాబ్ అనే వ్యక్తి చంపేస్తానంటున్నాడని పోలీసులకు లేఖ రాసిన పట్టించుకోలేదు. అప్పటి హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని బీజేపీ ఆరోపించింది. ఇటీవల ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే, బీహార్ పర్యటనపై ఆశిష్ షెలార్ ఎగతాళి చేశాడు. లాలూ దాణా కుంభకోణం కేసులో ఎంత తిన్నాడో తెలుసుకునేందుకు ఆదిత్య ఠాక్రే, తేజస్వీ యాదవ్ ను కలిశాడంటూ విమర్శించారు. జ్ఞాన్వాపి సమస్యపై కోర్టు ఆదేశాలను ఉద్ధవ్ జీ కూడా స్వాగతించలేదని అన్నారు.
తాజావార్తలు
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!