Gujarat Assembly elections: 160 మంది బీజేపీ తొలి జాబితా.. రవీంద్ర జడేజా భార్య, హార్దిక్ పటేల్కు ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన అధికార భారతీయ జనతా పార్టీ.. ఇవాళ తొలి జాబితాను విడుదల చేసింది.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు 160 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఇవాళ ప్రకటించింది.. కేంద్రమంత్రులు మన్సుఖ్ మాండవీయా, భూపేందర్ యాదవ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ సంయుక్త మీడియా సమావేశంలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు టిక్కెట్ దక్కడంతో ఆమె జామ్నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్ విరామ్గాం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి మజురా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.
Read Also: Lalu Prasad Yadav: నాన్నకు ప్రేమతో.. లాలూప్రసాద్ యాదవ్కు కూతురు కిడ్నీ దానం..
Also Read
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై బుధవారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం జరిగింది.. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప తదితరులు హాజరై ఎన్నికలు, అభ్యర్థులపై చర్చించారు.. సమావేశం ముగిసిన వెంటనే, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరియు అధికార బీజేపీకి చెందిన మరో ముగ్గురు నాయకులు కొత్త వారికి అవకాశం కల్పించడానికి రాష్ట్రంలోని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించారు. రూపానీ ఆగస్టు 2016 నుండి సెప్టెంబర్ 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం, అతను రాజ్కోట్ వెస్ట్ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు, గుజరాత్ ఎన్నికల కోసం బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం మంగళవారం సాయంత్రం జేపీ నడ్డా నివాసంలో జరిగింది.
గుజరాత్ దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉంది.. ఆ పార్టీ ఏడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తోంది.. గుజరాత్లో డిసెంబర్ 1, 5 తేదీల్లో పోలింగ్ జరగనుంది. బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఎన్నికల్లో బలమైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే, 182 మంది సభ్యులు గల గుజరాత్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. ఒకేసారి 160 మంది అభ్యర్థులతో తన మొదటి జాబితాను విడుదల చేసింది.. డిసెంబర్ 1న తొలి దశలో పోలింగ్ జరగనున్న 89 స్థానాల్లో 84 స్థానాలకు, డిసెంబర్ 5న రెండో దశలో ఎన్నికలు జరగనున్న 93 స్థానాల్లో 76 స్థానాలకు అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. జాబితాలో 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారని, పెద్ద సంఖ్యలో ప్రస్తుత శాసనసభ్యులు తొలగించబడ్డారని ఈ సందర్భంగా భూపేంద్ర యాదవ్ వెల్లడించారు.. జాబితాలో 14 మంది మహిళలు, షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల నుండి 13 మరియు 24 మంది సభ్యులు ఉన్నారు. 1995 నుంచి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నిరంతరాయంగా కొనసాగుతోన్న విజయ పరంపరను కొనసాగించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
తాజావార్తలు
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
-
Tragedy: దమ్ముంటే హైదరాబాద్కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
-
Used Smartphone Buying Guide: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా చెక్ చేయండి.. లేదంటే అంతే..!
-
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!