Gujarat Assembly elections: 160 మంది బీజేపీ తొలి జాబితా.. రవీంద్ర జడేజా భార్య, హార్దిక్ పటేల్కు ఛాన్స్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన అధికార భారతీయ జనతా పార్టీ.. ఇవాళ తొలి జాబితాను విడుదల చేసింది.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు 160 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఇవాళ ప్రకటించింది.. కేంద్రమంత్రులు మన్సుఖ్ మాండవీయా, భూపేందర్ యాదవ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ సంయుక్త మీడియా సమావేశంలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు టిక్కెట్ దక్కడంతో ఆమె జామ్నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్ విరామ్గాం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి మజురా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.
Read Also: Lalu Prasad Yadav: నాన్నకు ప్రేమతో.. లాలూప్రసాద్ యాదవ్కు కూతురు కిడ్నీ దానం..
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై బుధవారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం జరిగింది.. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప తదితరులు హాజరై ఎన్నికలు, అభ్యర్థులపై చర్చించారు.. సమావేశం ముగిసిన వెంటనే, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరియు అధికార బీజేపీకి చెందిన మరో ముగ్గురు నాయకులు కొత్త వారికి అవకాశం కల్పించడానికి రాష్ట్రంలోని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించారు. రూపానీ ఆగస్టు 2016 నుండి సెప్టెంబర్ 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం, అతను రాజ్కోట్ వెస్ట్ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు, గుజరాత్ ఎన్నికల కోసం బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం మంగళవారం సాయంత్రం జేపీ నడ్డా నివాసంలో జరిగింది.
గుజరాత్ దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉంది.. ఆ పార్టీ ఏడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తోంది.. గుజరాత్లో డిసెంబర్ 1, 5 తేదీల్లో పోలింగ్ జరగనుంది. బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఎన్నికల్లో బలమైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే, 182 మంది సభ్యులు గల గుజరాత్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. ఒకేసారి 160 మంది అభ్యర్థులతో తన మొదటి జాబితాను విడుదల చేసింది.. డిసెంబర్ 1న తొలి దశలో పోలింగ్ జరగనున్న 89 స్థానాల్లో 84 స్థానాలకు, డిసెంబర్ 5న రెండో దశలో ఎన్నికలు జరగనున్న 93 స్థానాల్లో 76 స్థానాలకు అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. జాబితాలో 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారని, పెద్ద సంఖ్యలో ప్రస్తుత శాసనసభ్యులు తొలగించబడ్డారని ఈ సందర్భంగా భూపేంద్ర యాదవ్ వెల్లడించారు.. జాబితాలో 14 మంది మహిళలు, షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల నుండి 13 మరియు 24 మంది సభ్యులు ఉన్నారు. 1995 నుంచి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నిరంతరాయంగా కొనసాగుతోన్న విజయ పరంపరను కొనసాగించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!