Lalu Prasad Yadav: నాన్నకు ప్రేమతో.. లాలూప్రసాద్ యాదవ్కు కూతురు కిడ్నీ దానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాన్న గురించి.. నాన్న గొప్పతనం గురించి.. నాన్నపై పిల్లలు చూపించే ప్రేమ గురించి సినిమాలు వచ్చాయి.. ఎన్నో పాటలు, పాఠాలు వచ్చాయి.. సోషల్ మీడియాలో అయితే.. ఎన్నో రకాల కవితలు, కథనాలు కూడా దర్శమిస్తుంటాయి.. అయితే, నిజ జీవితంలో నాన్నపై ప్రేమ చూపించేవారు ఎంత మంది? ఈ రోజుల్లో వారికి చేదుడు వాదుడుగా ఎవరు ఉంటున్నారు? అంటే మాత్రం.. అంతా ముందుకు వచ్చే పరిస్థితి లేదు.. అయితే, తాను అలా కాదు.. మా నాన్న కోసం ఏదైనా చేస్తాను అంటున్నారు బీహార్ మాజీ సీఎం, ఆర్డేజీ చీఫ్ లాలూ కుమార్తె రోహిణి ఆచార్య.. గత కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధి, ఇతర వ్యాధులతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్కు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీల్లో ఒకదానిని దానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.. నివేదికల ప్రకారం, అక్టోబర్లో సింగపూర్ పర్యటనలో ఆర్జేడీ చీఫ్ కిడ్నీ మార్పిడి చేయాలని సింగపూర్లోని వైద్యులు సలహా ఇవ్వడంతో రోహిణి తన కిడ్నీ తండ్రికి దానం చేయడానికి ముందుకొచ్చింది.
Read Also: 100 Years Old Voters: భారత్లో వందేళ్లు దాటిన ఓటర్లు 2.5 లక్షల మంది
Also Read
- Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
- Rahul Gandhi New Team: రాహుల్ గాంధీ కొత్త టీమ్ రెడీ.. 120 మంది నేతలను స్వయంగా ఇంటర్వ్యూ
- Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్రూమ్లో ఏడో తరగతి బాలుడి మృతి..
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
అయితే, లాలూ ప్రసాద్ మొదట రోహిణి తన కిడ్నీని దాసం చేస్తానంటే తీసుకోవడానికి ఇష్టపడలేదట.. కానీ, ఆమె ఒత్తిడి మరియు కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి తీసుకురావడంతో.. చివరకు ఆయన అంగీకరించినట్టు సమాచారం.. నవంబర్ 20-24 మధ్య మరోసారి లాలూ ప్రసాద్ యాదవ్.. సింగపూర్కు వెళ్లే అవకాశం ఉందని, ఆ సమయంలోనే కిడ్నీ మార్పిడికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సింగపూర్లో ఉన్న లాలూ రెండవ కుమార్తె రోహిణి తన తండ్రి కిడ్నీ వ్యాధుల గురించి చాలా ఆందోళన చెందారు.. కిడ్నీ మార్పిడికి సలహా ఇచ్చిన వైద్యుల బృందాన్ని సంప్రదించడానికి లాలూ సింగపూర్కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.. అయితే, గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న లాలూకు ఎయిమ్స్ వైద్యులు కిడ్నీ మార్పిడి చేయమని సలహా ఇవ్వలేదు.. కానీ, సింగపూర్ పర్యటనలో అక్కడి వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు.. ఇక, రోహిణి, సింగపూర్లో ఉన్నప్పటికీ, బీహార్లోని రాజకీయ సంఘటనలను నిశితంగా గమనిస్తూ ఉంటారు.. తన రాజకీయ అభిప్రాయాన్ని వినిపించడానికి మరియు ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడానికి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారామె. మొత్తంగా నాన్నపై తనకు ఉన్న ప్రేమను ఇలా చాటుకోబోతున్నారు రోహిణి.
తాజావార్తలు
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Layoffs: ఇండియాలో లేఆఫ్ ప్రకంపనలు.. ఆ కంపెనీ ఉద్యోగులకు భారీ షాక్..!
-
Arctic: ఆర్కిటిక్లో మంచు కరిగితే రూ.21లక్షల కోట్ల నష్టం?
-
Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
-
BRS MLAs Arrested: తీవ్ర ఉద్రిక్తత.. హరీష్ రావు, కేటీఆర్తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అరెస్ట్..
ట్రెండింగ్
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!