Lalu Prasad Yadav: నాన్నకు ప్రేమతో.. లాలూప్రసాద్ యాదవ్కు కూతురు కిడ్నీ దానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాన్న గురించి.. నాన్న గొప్పతనం గురించి.. నాన్నపై పిల్లలు చూపించే ప్రేమ గురించి సినిమాలు వచ్చాయి.. ఎన్నో పాటలు, పాఠాలు వచ్చాయి.. సోషల్ మీడియాలో అయితే.. ఎన్నో రకాల కవితలు, కథనాలు కూడా దర్శమిస్తుంటాయి.. అయితే, నిజ జీవితంలో నాన్నపై ప్రేమ చూపించేవారు ఎంత మంది? ఈ రోజుల్లో వారికి చేదుడు వాదుడుగా ఎవరు ఉంటున్నారు? అంటే మాత్రం.. అంతా ముందుకు వచ్చే పరిస్థితి లేదు.. అయితే, తాను అలా కాదు.. మా నాన్న కోసం ఏదైనా చేస్తాను అంటున్నారు బీహార్ మాజీ సీఎం, ఆర్డేజీ చీఫ్ లాలూ కుమార్తె రోహిణి ఆచార్య.. గత కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధి, ఇతర వ్యాధులతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్కు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీల్లో ఒకదానిని దానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.. నివేదికల ప్రకారం, అక్టోబర్లో సింగపూర్ పర్యటనలో ఆర్జేడీ చీఫ్ కిడ్నీ మార్పిడి చేయాలని సింగపూర్లోని వైద్యులు సలహా ఇవ్వడంతో రోహిణి తన కిడ్నీ తండ్రికి దానం చేయడానికి ముందుకొచ్చింది.
Read Also: 100 Years Old Voters: భారత్లో వందేళ్లు దాటిన ఓటర్లు 2.5 లక్షల మంది
Also Read
- Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
అయితే, లాలూ ప్రసాద్ మొదట రోహిణి తన కిడ్నీని దాసం చేస్తానంటే తీసుకోవడానికి ఇష్టపడలేదట.. కానీ, ఆమె ఒత్తిడి మరియు కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి తీసుకురావడంతో.. చివరకు ఆయన అంగీకరించినట్టు సమాచారం.. నవంబర్ 20-24 మధ్య మరోసారి లాలూ ప్రసాద్ యాదవ్.. సింగపూర్కు వెళ్లే అవకాశం ఉందని, ఆ సమయంలోనే కిడ్నీ మార్పిడికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సింగపూర్లో ఉన్న లాలూ రెండవ కుమార్తె రోహిణి తన తండ్రి కిడ్నీ వ్యాధుల గురించి చాలా ఆందోళన చెందారు.. కిడ్నీ మార్పిడికి సలహా ఇచ్చిన వైద్యుల బృందాన్ని సంప్రదించడానికి లాలూ సింగపూర్కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.. అయితే, గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న లాలూకు ఎయిమ్స్ వైద్యులు కిడ్నీ మార్పిడి చేయమని సలహా ఇవ్వలేదు.. కానీ, సింగపూర్ పర్యటనలో అక్కడి వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు.. ఇక, రోహిణి, సింగపూర్లో ఉన్నప్పటికీ, బీహార్లోని రాజకీయ సంఘటనలను నిశితంగా గమనిస్తూ ఉంటారు.. తన రాజకీయ అభిప్రాయాన్ని వినిపించడానికి మరియు ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడానికి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారామె. మొత్తంగా నాన్నపై తనకు ఉన్న ప్రేమను ఇలా చాటుకోబోతున్నారు రోహిణి.
తాజావార్తలు
-
RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
-
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
-
BCCI: బంగ్లాదేశ్ సిరీస్లపై స్పందించిన బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పర్యటనలు..
-
Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
-
Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్కు శుభవార్త.. ఇక దూసుకెళ్లుడే..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?