Lalu Prasad Yadav: నాన్నకు ప్రేమతో.. లాలూప్రసాద్ యాదవ్కు కూతురు కిడ్నీ దానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాన్న గురించి.. నాన్న గొప్పతనం గురించి.. నాన్నపై పిల్లలు చూపించే ప్రేమ గురించి సినిమాలు వచ్చాయి.. ఎన్నో పాటలు, పాఠాలు వచ్చాయి.. సోషల్ మీడియాలో అయితే.. ఎన్నో రకాల కవితలు, కథనాలు కూడా దర్శమిస్తుంటాయి.. అయితే, నిజ జీవితంలో నాన్నపై ప్రేమ చూపించేవారు ఎంత మంది? ఈ రోజుల్లో వారికి చేదుడు వాదుడుగా ఎవరు ఉంటున్నారు? అంటే మాత్రం.. అంతా ముందుకు వచ్చే పరిస్థితి లేదు.. అయితే, తాను అలా కాదు.. మా నాన్న కోసం ఏదైనా చేస్తాను అంటున్నారు బీహార్ మాజీ సీఎం, ఆర్డేజీ చీఫ్ లాలూ కుమార్తె రోహిణి ఆచార్య.. గత కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధి, ఇతర వ్యాధులతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్కు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీల్లో ఒకదానిని దానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.. నివేదికల ప్రకారం, అక్టోబర్లో సింగపూర్ పర్యటనలో ఆర్జేడీ చీఫ్ కిడ్నీ మార్పిడి చేయాలని సింగపూర్లోని వైద్యులు సలహా ఇవ్వడంతో రోహిణి తన కిడ్నీ తండ్రికి దానం చేయడానికి ముందుకొచ్చింది.
Read Also: 100 Years Old Voters: భారత్లో వందేళ్లు దాటిన ఓటర్లు 2.5 లక్షల మంది
Also Read
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
- India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
- E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
అయితే, లాలూ ప్రసాద్ మొదట రోహిణి తన కిడ్నీని దాసం చేస్తానంటే తీసుకోవడానికి ఇష్టపడలేదట.. కానీ, ఆమె ఒత్తిడి మరియు కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి తీసుకురావడంతో.. చివరకు ఆయన అంగీకరించినట్టు సమాచారం.. నవంబర్ 20-24 మధ్య మరోసారి లాలూ ప్రసాద్ యాదవ్.. సింగపూర్కు వెళ్లే అవకాశం ఉందని, ఆ సమయంలోనే కిడ్నీ మార్పిడికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సింగపూర్లో ఉన్న లాలూ రెండవ కుమార్తె రోహిణి తన తండ్రి కిడ్నీ వ్యాధుల గురించి చాలా ఆందోళన చెందారు.. కిడ్నీ మార్పిడికి సలహా ఇచ్చిన వైద్యుల బృందాన్ని సంప్రదించడానికి లాలూ సింగపూర్కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.. అయితే, గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న లాలూకు ఎయిమ్స్ వైద్యులు కిడ్నీ మార్పిడి చేయమని సలహా ఇవ్వలేదు.. కానీ, సింగపూర్ పర్యటనలో అక్కడి వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు.. ఇక, రోహిణి, సింగపూర్లో ఉన్నప్పటికీ, బీహార్లోని రాజకీయ సంఘటనలను నిశితంగా గమనిస్తూ ఉంటారు.. తన రాజకీయ అభిప్రాయాన్ని వినిపించడానికి మరియు ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడానికి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారామె. మొత్తంగా నాన్నపై తనకు ఉన్న ప్రేమను ఇలా చాటుకోబోతున్నారు రోహిణి.
తాజావార్తలు
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Helicopter Crash: కూలిన హెలికాప్టర్.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐదుగురు అమెరికా పౌరులతో సహా ఏడుగురు మృతి
-
IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
-
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!