Munugode By Election Results: బీజేపీ, టీఆర్ఎస్ ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన సీఈవో వికాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munugode By Election Results: మునుగోడు ఉప ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 8గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మూడు రౌండ్ వరకు ఓట్లు లెక్కింపు ఊపందుకున్నా 4వ రౌండ్ నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు కాస్త జాప్యం ఏర్పడింది. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ లు సీఈవో తీరుపై మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎందుకు జాప్యం వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవార్తలపై స్పందించిన సీఈవో వికాస్రాజ్ మాట్లాడుతూ.. జాప్యం లేకుండా ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తాం మన్నారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు లేవన్నారు. 47 మంది అభ్యర్థులు ఉన్నందున సమయం ఎక్కవ పడుతోందని చెప్పారు. ప్రతి టేబుల్ వద్ద అబ్జర్వర్లు, ఏజెంట్లు ఉన్నారని అన్నారు. ఎన్నికల ఫలితాలు జాప్యం లేకుండా వెల్లడిస్తున్నామని అన్నారు. ఆర్వో సంతకం చేసిన తర్వాతే ఫలితాలు విడుదల చేస్తున్నామన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో అనుమానాస్పదంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీఈవో వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 8గంటల నుంచి మొదలైన మొదటి, రెండు, మూడు, రౌండ్లు త్వరగా వెల్లడించారని నాలుగో రౌండ్ నుంచి ఎందు జాప్యం వస్తుందని, టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను సీఈవో అప్ డేట్ చేయడం లేదని బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. పలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను సీఈవో ఎందుకు వెల్లడించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. మీడియా నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదు? అని ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
మధ్యాహ్నం కావస్తున్నా.. ఇప్పటి వరకు ఐదు రౌండ్లు ఫలితాలే వెల్లడి అయ్యాయి.. ఓవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదో చేస్తుందనే అనుమానాలు భారతీయ జనతా పార్టీ నేతలు వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు.. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జాప్యంపైన అధికార టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.. రౌండ్లవారీగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఆలస్యం అవడంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి… కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాకి అధికారులు లీకులు అందిస్తున్నారన్న వార్తలపై ఎలక్షన్ కమిషన్ స్పందించాలని డిమాండ్ చేశారు.. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి స్వయంగా వివరాలు తెలిపాలని డిమాండ్ చేశారు మంత్రి జగదీష్రెడ్డి.
https://www.youtube.com/watch?v=c3PzWZlboxg
తాజావార్తలు
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!