Ramcharitmanas row: ఖురాన్, బైబిల్పై మాట్లాడే దమ్ముందా.. అఖిలేష్ యాదవ్ను ఉరితీయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramcharitmanas row: ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నేతలు ‘రామచరిత మానస్’పై చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపుతూనే ఉన్నాయి. ఎస్పీ నేత స్వామీ ప్రసాద్ మౌర్య రామచరిత మానస్ పై చేసిన వ్యాక్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హిందువులకు వ్యతిరేకంగా ఎస్పీ మాట్లాడుతోందని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలతు. తాజాగా యూపీ బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుర్జార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, స్వామి ప్రసాద్ మౌర్యలను బహిరంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు.
Read Also: Cancer Cases: భారతదేశంలో 2026 నాటికి ఏడాదికి 20 లక్షల క్యాన్సర్ కేసులు ?
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
బైబిల్, ఖురాన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడే ధైర్యం వారికిలేదని.. అలాంటి వారిపై విచారణ జరిపి బహిరంగంగా ఉరితీయాలని నంద్ కిషోర్ అన్నారు. ప్రజలు తమకు వ్యతిరేకంగా ఉన్నారని.. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఎస్పీ నాయకులు హిందూ సమాజాన్ని కావాలనే బలహీనం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా హిందూ మతాన్ని, సంస్కృతాన్ని కించపరుస్తున్నారని నంద్ కిషోర్ అన్నారు.
ఇటీవల సమాజ్ వాదీ పార్టీ నేత ఎమ్మెల్సీ స్వామి ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ కులాన్ని, మతం పేరుతో అవమానించడాన్ని ఆక్షేపించాలని అన్నారు. రామచరిత మానస్ చదవని ప్రజలు కోట్లలో ఉన్నారని అన్నారు. దళితులు చదవడం, రాయడం అనే హక్కు బ్రిటీష్ కాలం నాటిదని.. బ్రిటీష్ పాలనలోనే మహిళలు అక్షరాస్యత సాధించే హక్కును పొందారని అన్నారు. ఈ వ్యాఖ్యలు యూపీలో రాజకీయంగా వివాదాస్పదం అయ్యాయి. గతంలో బీహార్ విద్యా మంత్రి చంద్ర శేఖర్ మాట్లాడుతూ, రామాయణం ఆధారంగా రూపొందించిన హిందూ మతపరమైన పుస్తకం ‘సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుంది’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!