Ramcharitmanas row: ఖురాన్, బైబిల్పై మాట్లాడే దమ్ముందా.. అఖిలేష్ యాదవ్ను ఉరితీయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramcharitmanas row: ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నేతలు ‘రామచరిత మానస్’పై చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపుతూనే ఉన్నాయి. ఎస్పీ నేత స్వామీ ప్రసాద్ మౌర్య రామచరిత మానస్ పై చేసిన వ్యాక్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హిందువులకు వ్యతిరేకంగా ఎస్పీ మాట్లాడుతోందని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలతు. తాజాగా యూపీ బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుర్జార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, స్వామి ప్రసాద్ మౌర్యలను బహిరంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు.
Read Also: Cancer Cases: భారతదేశంలో 2026 నాటికి ఏడాదికి 20 లక్షల క్యాన్సర్ కేసులు ?
Also Read
బైబిల్, ఖురాన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడే ధైర్యం వారికిలేదని.. అలాంటి వారిపై విచారణ జరిపి బహిరంగంగా ఉరితీయాలని నంద్ కిషోర్ అన్నారు. ప్రజలు తమకు వ్యతిరేకంగా ఉన్నారని.. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఎస్పీ నాయకులు హిందూ సమాజాన్ని కావాలనే బలహీనం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా హిందూ మతాన్ని, సంస్కృతాన్ని కించపరుస్తున్నారని నంద్ కిషోర్ అన్నారు.
ఇటీవల సమాజ్ వాదీ పార్టీ నేత ఎమ్మెల్సీ స్వామి ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ కులాన్ని, మతం పేరుతో అవమానించడాన్ని ఆక్షేపించాలని అన్నారు. రామచరిత మానస్ చదవని ప్రజలు కోట్లలో ఉన్నారని అన్నారు. దళితులు చదవడం, రాయడం అనే హక్కు బ్రిటీష్ కాలం నాటిదని.. బ్రిటీష్ పాలనలోనే మహిళలు అక్షరాస్యత సాధించే హక్కును పొందారని అన్నారు. ఈ వ్యాఖ్యలు యూపీలో రాజకీయంగా వివాదాస్పదం అయ్యాయి. గతంలో బీహార్ విద్యా మంత్రి చంద్ర శేఖర్ మాట్లాడుతూ, రామాయణం ఆధారంగా రూపొందించిన హిందూ మతపరమైన పుస్తకం ‘సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుంది’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!