India vs China: అరుణాచల్ దగ్గర చైనా భారీ డ్యామ్ నిర్మాణం.. కేంద్రం కల్పించుకోవాలన్న బీజేపీ ఎమ్మెల్యే..!
- అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో భారీ డ్యామ్ నిర్మిస్తున్న చైనా..
- చైనాతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే ఎరింగ్ విజ్ఞప్తి..
- డ్యామ్ నిర్మాణం పూర్తైతే అస్సాం.. అరుణాచల్.. బంగ్లాదేశ్ లో వరదలు వచ్చే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs China: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో డ్రాగన్ కంట్రీ చైనా భారీ డ్యామ్ నిర్మిస్తోంది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డ్యామ్ నిర్మాణం వల్ల వరదలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయాన్ని చైనాతో చర్చించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని మెడోగ్లోని యార్లంగ్ త్సాంగ్పో నదిపై చైనా 60 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో భారీ డ్యామ్ను నిర్మిస్తుంది.. త్సాంగ్పో నదిని అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్, అస్సాంలో బ్రహ్మపుత్ర అని పిలుస్తారు.
Read Also: Prabhas : మరో స్టార్ దర్శకుడితో మొదలెట్టిన రెబల్ స్టార్..!
Also Read
అయితే, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో ప్రసంగిస్తూ కేంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఎరింగ్ మాట్లాడుతూ.. మేము మన పక్క దేశాన్ని నమ్మలేం.. ఎప్పుడు ఏం చేస్తుందో తెలియడం లేదు.. చైనా మొత్తం నదీ ప్రవాహాన్ని మళ్లించడం ద్వారా సియాంగ్ను ముంచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. ఈ డ్యామ్ నిర్మాణం పూర్తైతే భారత్పైనే కాకుండా బంగ్లాదేశ్పై కూడా దీని ప్రభావంతో వరదలు సంభవించే అవకాశం ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే ఎరింగ్ తేల్చి చెప్పారు.
Read Also: Amit Shah: నేడు రాంచీలో కేంద్ర హోంమంత్రి పర్యటన.. కార్యకర్తలతో అమిత్ షా భేటీ..!
అలాగే భారత్, చైనాల మధ్య ఇప్పటి వరకు ఎలాంటి నీటి ఒప్పందం జరగలేదని సమాచారం. డ్యాం వ్యతిరేకుల నిరసనను ప్రస్తావిస్తూ.. డ్యామ్ నిర్మాణానికి ముందు సంప్రదింపులు జరపాలని, ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఎరింగ్ సూచించారు. యార్లంగ్ త్సాంగ్పో నదిపై భారీ ఆనకట్ట వల్ల ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా సియాంగ్ నదిపై భారీ బ్యారేజీని నిర్మించాలని కేంద్రం ప్రతిపాదించిందని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ.. గత ఏడాది సెప్టెంబర్లో తెలియజేశారు. అధిక నీటిని విడుదల చేస్తే.. వరదల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి పెద్ద నిర్మాణాలు నిర్మించాల్సి ఉంటుందన్నారు. చైనా ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత సియాంగ్ నది పరిస్థితిపై కేంద్రం కూడా ఆందోళన వ్యక్తం చేసింది అని చెప్పుకొచ్చారు. నది ప్రవాహాన్ని చైనా మళ్లిస్తే పెద్ద ఎత్తున భూమి కోతకు గురవుతుంది అని సీఎం పెమా ఖండూ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
-
SBI PO Recruitment 2026: 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు ఎస్బీఐ నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం పూర్తి వివరాలు
-
Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
-
Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
ట్రెండింగ్
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..