Sushil Modi: నితీష్ కుమార్ తన జీవితంలో ప్రధాని కాలేడు.. ఆర్జేడీ బీహార్ని జేడీయూ ముక్త్ చేస్తుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Leader sushil modi comments on cm nitish kumar: బీజేపీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. బీహార్ పొత్తు వదులకున్న తర్వాత నుంచి సుశీల్ మోదీ, నితీష్ కుమార్ పై వరసగా విమర్శలు చేస్తున్నారు. నితీష్ కుమార్ తన జీవితంలో ప్రధాని కాలేడని.. ఆర్జేడీ పార్టీ బీహార్ లో జేడీయూ లేకుండా చేస్తుందని జోస్యం చెప్పారు. మణిపూర్ రాష్ట్రంలో ఏడుగురిలో ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో నితీష్ కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. గతంలో అరుణాచల్ ప్రదేశ్ లో కూడా జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.
ఈ విషయంపై కూడా సుశీల్ మోదీ స్పందించారు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లు జేడీయూ నుంచి విముక్తి పొందాయన్నారు. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ త్వరలోనే జనతాదళ్(యునైటెడ్)( జేడీయూ) పార్టీని విచ్ఛిన్నం చేస్తారని అన్నారు. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ(ఆర్జేడీ) బీహార్ లో ‘జేడీయూ ముక్త్’ చేస్తుంనది ఆయన అన్నారు. మణిపూర్ లో బీజేపీ ధనబలం ఉపయోగించి తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని.. ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను నిరాధారమైనవని సువీల్ మోదీ అన్నారు. మీ పార్టీలు డబ్బులతో కొనుగోలు చేసేంత వీక్ గా ఉన్నారా..? అంటూ ప్రశ్నించారు. మణిపూర్ జేడీయూ ఎమ్మెల్యేలు ఎన్డీయేతో ఉండాలనుకుని బీజేపీలో చేరాలని అనుకున్నారని సుశీల్ మోదీ అన్నారు.
Also Read
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
Read Also: Team India: టీమిండియాకు బిగ్షాక్ తప్పదా? అతడి స్థానాన్ని రీప్లేస్ చేసేదెవరు?
జేడీయూ జాతీయ పార్టీ కావాలని కలలు కందని.. గతంలో మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉంటే ప్రస్తుతం బీహార్ కే పరిమితం అయిందని ఎద్దేవా చేశారు. నితీష్ కుమార్ జాతీయ స్థాయిలో వార్తల్లో ఉండేందుకే ఎన్డీయే, బీజేపీతో పొత్తు తెంచుకున్నారని ఆయన అన్నారు. పోస్టర్లు, హోర్డింగులు ఎవరిని ప్రధాని చేయలేవని.. నితీష్ కుమార్ ఎన్నటికి ప్రధాన మంత్రి కాలేడని అన్నారు. ఇక పార్టీ 5-10 ఎంపీలను కలిగి ఉంటే ఎలా ప్రధాని అవుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇటీవల బీహార్ లో నితీష్ కుమార్ జేడీయూ పార్టీ బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో బీజేపీ బీహార్ లో ప్రతిపక్ష పార్టీగా మారింది. జేడీయూ ఈ స్టెప్ తీసుకున్న కొన్ని రోజుల తర్వాత మణిపూర్ రాష్ట్రంలో నితీష్ కుమార్ కు బీజేపీ బిగ్ షాక్ ఇచ్చింది.
తాజావార్తలు
-
Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
-
Geetu Mohandas: “నేను రాసిందొకటి.. తీసిందొకటి”.. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
-
Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
-
OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
ట్రెండింగ్
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?