Bengal violence: బెంగాల్ హింసపై ఎన్ఐఏ దర్యాప్తు చేయాలి.. కేంద్రాన్ని కోరిన బీజేపీ నేత..
- బెంగాల్ హింసపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలి..
- కేంద్రమంత్రికి బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి లేఖ..
- రైల్వే స్టేషన్లపై దాడి గురించి ప్రస్తావన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal violence: పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్లో అల్లర్లు జరిగాయి. కొందరు దుకాణాలు, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ప్రాంతంలోని రైల్వే స్టేషన్లలో జరిగిన అనేక విధ్వంసక సంఘటనలు జరిగాయి. అయితే, ఈ అల్లర్లపై ఎన్ఐఏ దర్యాప్తు జరపాలని ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కి లేఖ రాశారు. ఈ ప్రాంతంలో రైల్వే స్టేషన్లపై జరిగిన దాడి వెనక కీలక కుట్రదారుల్ని వెలుగులోకి తేవాలాని, నేరస్తుల్ని గుర్తించడానికి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా విచారణ సహాయపడుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Read Also: Congress: “సంఘటన్ సుజన్ అభియాన్” ప్రారంభం.. సంస్థాగత ప్రక్షాళనకు కాంగ్రెస్ శ్రీకారం..
Also Read
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
- అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
- Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
శుక్రవారం, ముర్షిదాబాద్లోని ధులియన్ రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున మారణహోమం జరిగింది, ఒక గుంపు రిలే గదిని ధ్వంసం చేసింది. రైల్వే ఉద్యోగుల వాహనాలకు నిప్పుపెట్టారు. ఉద్యోగులు ఈ అల్లర్ల వల్ల ప్రాణభయంతో పారిపోయారు. దీంతో తూర్పు రైల్వేలో పలు రైళ్లను దారి మళ్లించారు. ఇలాంటి అల్లర్లు దేశానికి ముప్పు కలిగిస్తాయని సువేందు అధికారి అన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ముర్షిదాబాద్లో పీఎఫ్ఐ, సిమి వంటి నిషేధిత సంస్థలు పనిచేస్తున్నాయనని, ఇవి సరిహద్దుల్లో చిక్కుల్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఆయన లేఖలో అన్నారు.
ఈ కేసును ఉగ్రవాద నిరోధక సంస్థ ఎన్ఐఏకి అప్పగించడం వల్ల వేగవంతమైన, సమగ్రమైన, తటస్థ దర్యాప్తు జరుగుతుందని బీజేపీ అన్నారు. ధులియాండంగా, నిమ్టిటా స్టేషన్ల మధ్య హింసాత్మక నిరసనలు జరిగాయి. దీంతో రైలు సేవలకు 6 గంటల పాటు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఈ అల్లర్లలో 15 మంది పోలీసులు గాయపడ్డారు. 118 మందిని అరెస్ట్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి జావేద్ షమీమ్ చెప్పారు.
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!