Bengal violence: బెంగాల్ హింసపై ఎన్ఐఏ దర్యాప్తు చేయాలి.. కేంద్రాన్ని కోరిన బీజేపీ నేత..
- బెంగాల్ హింసపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలి..
- కేంద్రమంత్రికి బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి లేఖ..
- రైల్వే స్టేషన్లపై దాడి గురించి ప్రస్తావన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal violence: పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్లో అల్లర్లు జరిగాయి. కొందరు దుకాణాలు, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ప్రాంతంలోని రైల్వే స్టేషన్లలో జరిగిన అనేక విధ్వంసక సంఘటనలు జరిగాయి. అయితే, ఈ అల్లర్లపై ఎన్ఐఏ దర్యాప్తు జరపాలని ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కి లేఖ రాశారు. ఈ ప్రాంతంలో రైల్వే స్టేషన్లపై జరిగిన దాడి వెనక కీలక కుట్రదారుల్ని వెలుగులోకి తేవాలాని, నేరస్తుల్ని గుర్తించడానికి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా విచారణ సహాయపడుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Read Also: Congress: “సంఘటన్ సుజన్ అభియాన్” ప్రారంభం.. సంస్థాగత ప్రక్షాళనకు కాంగ్రెస్ శ్రీకారం..
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
శుక్రవారం, ముర్షిదాబాద్లోని ధులియన్ రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున మారణహోమం జరిగింది, ఒక గుంపు రిలే గదిని ధ్వంసం చేసింది. రైల్వే ఉద్యోగుల వాహనాలకు నిప్పుపెట్టారు. ఉద్యోగులు ఈ అల్లర్ల వల్ల ప్రాణభయంతో పారిపోయారు. దీంతో తూర్పు రైల్వేలో పలు రైళ్లను దారి మళ్లించారు. ఇలాంటి అల్లర్లు దేశానికి ముప్పు కలిగిస్తాయని సువేందు అధికారి అన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ముర్షిదాబాద్లో పీఎఫ్ఐ, సిమి వంటి నిషేధిత సంస్థలు పనిచేస్తున్నాయనని, ఇవి సరిహద్దుల్లో చిక్కుల్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఆయన లేఖలో అన్నారు.
ఈ కేసును ఉగ్రవాద నిరోధక సంస్థ ఎన్ఐఏకి అప్పగించడం వల్ల వేగవంతమైన, సమగ్రమైన, తటస్థ దర్యాప్తు జరుగుతుందని బీజేపీ అన్నారు. ధులియాండంగా, నిమ్టిటా స్టేషన్ల మధ్య హింసాత్మక నిరసనలు జరిగాయి. దీంతో రైలు సేవలకు 6 గంటల పాటు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఈ అల్లర్లలో 15 మంది పోలీసులు గాయపడ్డారు. 118 మందిని అరెస్ట్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి జావేద్ షమీమ్ చెప్పారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!