President Elections: రాష్ట్రపతి ఎన్నికలకు బీజేపీ రెడీ.. 14 మందితో క్యాంపెయినింగ్ టీమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీ రెడీ అవుతోంది. దేశ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి 14 మందితో కూడిన టీంను ఏర్పాటు చేశారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కన్వీనర్ ఉండనున్నారు. గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, శర్వానంద్ సోనోవాల్, అర్జున్ మేఘ్ వాల్, భారతీ పవార్, తరుణ్ చుగ్, డీకే అరుణ, రితురాజ్ సిన్హా, వానాటి శ్రీనివాసన్, సంబిత్ పాత్ర, రాజ్ దీప్ రాయ్ తోె పాటు సీటీ రవి, వినోద్ తావ్డే వీరిద్దరు కోకన్వీనర్లుగా వ్యవహరించనున్నారు.
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థిని వచ్చే వారం నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు ప్రతిపక్షాలు కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిని దింపాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల మీటింగ్ జరిగింది. తాజాగా జీ7 దేశాల సదస్సు కోసం ప్రధాని మోదీ జర్మనీకి వెళ్లనున్నారు. ఆయన పర్యటన ముగించుకుని వచ్చే లోపు వచ్చే వారం బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. నామినేషన్లకు చివరి తేదీ జూన్ 29 కావడంతో ఈలోపు రాష్ట్రపతి అభ్యర్థిని డిక్లెర్ చేయనున్నారు.
Also Read
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
రాష్ట్రపతి ఎన్నికలకు జూన్ 15న కేంద్రం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. జూలై 18న ఎన్నికలు జరుగనున్నాయి. జూలై 21న కొత్త రాష్ట్రపతి ఎవరో తెలియనుంది. వచ్చే నెల 24తో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ముగియనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఏర్పడిన బీజేపీ ఎన్నికల టీం దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు కూడగట్టనున్నాయి.
ఎన్డీయే అభ్యర్థికి మద్దతు కూడగట్టేందుకు మంత్రులు, పార్టీ అధికారులతో కూడిన బీజేపీ కమిటీ దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనుంది. ఎన్డీయే తన రాష్ట్రపతి అభ్యర్థిని స్వయంగా గెలిపించుకునే ఓట్లు లేవు. అయితే బిజూ జనతాదళ్, వైసీపీ, టీడీపీ మద్దతు పొందే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ప్రతిపక్షాల మీటింగ్ కు టీఆర్ఎస్, ఆప్ తన పార్టీ తరుపున ఎవరిని పంపించలేదు.
తాజావార్తలు
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!