Shashi Tharoor: ముషారఫ్పై థరూర్ ట్వీట్.. భగ్గుమన్న బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Fires On Shashi Tharoor Tweet On Parvez Musharraf: శాంతికోసం గట్టిగా ప్రయత్నించిన వ్యక్తి అంటూ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్పై కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మన దేశ సైనికులను చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తిని.. శాంతి కోసం ప్రయత్నించిన వ్యక్తిగా ఎలా అభివర్ణిస్తారంటూ థరూర్పై ప్రశ్నల వర్షం కురిపించారు. అందుకు థరూర్ తిరిగి కౌంటర్ ఇవ్వడంతో.. వివాదం మరింత ముదిరింది. ఇరువురి మధ్య వాగ్వాదం మొదలైంది. ముఖ్యంగా.. థరూర్పై బీజేపీ భగ్గుమంటోంది.
Ravindra Jadeja: నేనూ ఆడితే బాగుండేది..గాయంపై జడేజా ఎమోషనల్ కామెంట్స్
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
‘‘ఒకప్పుడు ముషారఫ్ భారతదేశానికి శత్రువు. కానీ, ఆయనే 2002-2007 మధ్యకాలంలో శాంతి స్థాపనకు నిజమైన శక్తిగా మారారు. ఆ రోజుల్లో ఆయన్ని ప్రతి ఏటా ఐక్యరాజ్య సమితిలో కలిసేవాడ్ని. తన వ్యూహాత్మక ఆలోచనలతో ముషారఫ్ చాలా తెలివిగా, స్పష్టంగా కనిపించేవారు’’ అంటూ ముషారఫ్ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ థరూర్ ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా మన దేశంలో ఉగ్రవాదాన్ని చొప్పించి, భారత సైనికుల్ని హింసించిన వ్యక్తిని శాంతి కోసం ప్రయత్నించాడంటూ ఎలా అభివర్ణిస్తారని నిలదీసింది. థరూర్ చేసిన ఈ ట్వీట్.. కాంగ్రెస్ వైఖరిని ప్రతిబింబిస్తోందంటూ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా విమర్శించారు.
Balakrishna: నర్సులపై చేసిన వ్యాఖ్యల దుమారం.. వక్రీకరంచారంటూ బాలయ్య వివరణ
అందుకు థరూర్ బదులిస్తూ.. ముషారఫ్ భారత్కి శత్రువేనని, కార్గిల్ యుద్ధ బాధ్యుడని, కానీ 2002-2007 మధ్యకాలంలో తన స్వప్రయోజనాల కోసం భారత్తో శాంతిని బలంగా కోరుకున్నారన్నారు. ముషారఫ్ భారత్కి మిత్రుడు కాకపోయినా, శాంతిలోనే ఆయన వ్యూహాత్మక ప్రయోజనాల్ని వెతుక్కున్నారన్నారు. ఇదే సమయంలో ఓ ప్రశ్న కూడా సంధించారు. ‘‘బీజేపీ లీడర్స్కి సూటి ప్రశ్న. దేశభక్తి గల భారతీయులకు ముషారఫ్ వ్యతిరేకి అయితే.. 2003లో బీజేపీ ప్రభుత్వం అతనితో కాల్పుల విరమణపై చర్చలు జరిపి, 2004లో వాజ్పేయి-ముషారఫ్ల జాయింట్ స్టేట్మెంట్పై ఎందుకు సంతకం చేసింది? అప్పుడు అతను పీస్ పార్ట్నర్గా కనిపించలేదా?’’ అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!