Rahul Gandhi: గిరిజనులు అభివృద్ధి చెందకూడదని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: గిరిజనులు అభివృద్ధి చెందకుండా అడవిలోనే జీవించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఆదీవాసీలు దేశానికి యజమానులని తాము నమ్ముతున్నామని.. భూమిపై వారికి హక్కుందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆదీవాసీల నుండి భూములను లాక్కొని అదానీకి అప్పగిస్తున్నారని విమర్శించారు. గిరిజనులకు భూమిపై హక్కులు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని రాహుల్ గుర్తు చేశారు. తాము హక్కులు కల్పిస్తే బీజేపీ వాటిని రద్దు చేసిందని రాహుల్ విమర్శించారు. గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజస్థాన్ రాష్ట్రంలోని మాన్గర్ థామ్ లో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పుణ్యభూమికి అందరికి స్వాగతం అంటూ రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మాన్గర్ధామ్ లో బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణాలు అర్పించిన గిరిజన సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తన నానమ్మ ఇందిరా గాంధీ బాల్యంలో తనకు ఇచ్చిన పుస్తకం గురించి రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు.ఈ పుస్తకం తనకు ఎంతో నచ్చిన పుస్తకంగా ఆయన పేర్కొన్నారు. తాను మీ సైనికుడినని.. ఢిల్లీలో ఉంటానని రాహుల్ చెప్పారు. మీరు ఎప్పుడైనా రాజస్థాన్ కు పిలవొచ్చని రాహుల్ గాంధీ గిరిజనులను కోరారు.
Read also: Mahesh Babu: అంతరిక్షంలో మహేష్ పేరుతో ఒక నక్షత్రం.. సూపర్ స్టార్ ఫ్యాన్సా..? మజాకానా.. ?
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
- DK Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన డీకే శివకుమార్
- JEE Advanced Result 2026: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రిలీజ్.. టాపర్ ఎవరంటే?
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
ఆధునిక సమాజం గిరిజనుల జీవితం నుండి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని రాహుల్ గాంధీ అన్నారు. భారతదేశం పూర్వం ఆదివాసీల భూమి అని గుర్తు చేశారు. గిరిజనుల పిల్లలు ఏం కావాలని కోరుకుంటున్నారో అది నిజం కావాలని తాము భావిస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. గిరిజనులు అడవిలోనే ఉండాలని మీ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావొద్దని బీజేపీ కోరుకుంటుందని విమర్శించారు. మణిపూర్ లో బీజేపీ భరతమాతను హత్యచేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. సైన్యాన్ని దింపి గొడవలను నివారించే అవకాశం ఉన్నప్పటికీ ప్రధాని మోడీ ఆ పని చేయడం లేదని మండిపడ్డారు. మణిపూర్లో ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడటం లేదని రాహుల్ ప్రశ్నించారు. తాను పార్లమెంట్ లో కూడ ఇదే విషయాన్ని ప్రస్తావించానని చెప్పారు. పేద ప్రజల కోసం రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెట్టిందని.. కేవలం పెన్షన్ పథకం ద్వారానే 90 లక్షల మందికి పైగా లబ్ది పొందుతున్నారని రాహుల్ గాంధీ తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: చెప్పట్లేదు కానీ చాలా ఒత్తిడి ఉంది.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు!
-
EV Sales India 2026: ఈవీ అమ్మకాల జోరు.. మే నెలలో రికార్డు స్థాయిలో 150,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు సేల్..!
-
RCB Victory Celebrations: ఆర్సీబీ ఫ్యాన్స్కు షాక్.. విజయోత్సవ ర్యాలీపై ఫ్రాంచైజీ కీలక ప్రకటన..
-
Peddi Ticket Booking :”పెద్ది” ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… టికెట్ బుకింగ్స్ షురూ
-
Rajat Patidar History: రజత్ పాటీదార్ అరుదైన ఘనత.. ధోనీ, రోహిత్ సరసన ఆర్సీబీ కెప్టెన్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!