Rahul Gandhi: బిల్కిస్ బానో తీర్పు.. అహంకార బీజేపీపై విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: బిల్కిస్ బానో కేసులో ఈ రోజు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గతంలో గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ద్వారా విడుదల చేసిన 11 నిందితులను ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై కాంగ్రెస్తో సహా ఇతర ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది న్యాయం సాధించిన విజయమని, బీజేపీ మహిళా వ్యతిరేకి అని, నేరస్తులను ప్రోత్సహిస్తోందని ఆరోపించాయి.
తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. బిల్కిస్ బానో అవిశ్రాంత పోరాటం బీజేపీ అహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ విజయంగా అభివర్ణించారు. ఎన్నికల ప్రయోజనాల కోసం న్యాయాన్ని చంపేసే ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని, ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు నేరస్తులను పెంచి పోషిస్తుంది ఎవరనే విషయాన్ని దేశానికి చాటి చెప్పిందని రాహుల్ ఎక్స్(ట్విట్టర్) లో వ్యాఖ్యానించారు. ఆయన సోదరి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా.. చివరకు న్యాయం గెలిచిందనన్నారు. ఇది బీజేకి చెంపదెబ్బ అని టీఎంసీ కామెంట్ చేసింది.
Also Read
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
Read Also: Devara: దేవర గ్లింప్స్.. సముద్రం ఎరుపెక్కాలా
ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. మహిళా సాధికారిత విషయంలో బీజేపీ చేస్తున్న వాదనల్ని ఇది బహిర్గతం చేసిందని ఆరోపించారు. ఏ ప్రభుత్వం తమ చేతుల్లోకి అధికారాన్ని తీసుకుని నేరస్తుల్ని అరెస్ట్ చేయకూడదని, అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎందుకు మౌనంగా ఉందని అడగాలనుకుంటున్నానని, ఈ దోషులు విడుదలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎందుకు ఆమోదించిందని అసద్ ప్రశ్నించారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బిల్కిస్ బానోకు, ఆమె కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని ఓవైసీ డిమాండ్ చేశారు.
గుజరాత్లో 2002 గోద్రా అనంతర అల్లర్లలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి ఆమె కుటుంబ సభ్యులలో ఏడుగురిని హతమార్చిన కేసులో దోషులుగా ఉన్న 11 మందిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సోమవారం రద్దు చేసింది. అటువంటి ఉత్తర్వును ఆమోదించేంత సామర్థ్యం గుజరాత్ ప్రభుత్వానికి లేదని కోర్టు తీర్పు చెప్పింది. ఆగస్టు 15, 2022న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన 11 మంది ఖైదీలు రెండు వారాల్లోగా జైలు అధికారుల ముందు లొంగిపోవాలని కోరింది. మార్చి 3, 2002న గుజరాత్లో గోద్రా రైలు దహనం ఘటన తర్వాత చెలరేగిన అల్లర్ల నుండి పారిపోతున్నప్పుడు బిల్కిస్ బానోపై 21 ఏళ్ల వయసులో అత్యాచారం జరిగింది. ఈ సమయంలో ఆమె ఐదునెలల గర్భవతి. ఆమె కుటుంబంలో ఏడుగురు హత్యకు గురయ్యారు.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!