Bihar Politics: బీజేపీతో జేడీయూ తెగదెంపులు.. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన సీఎం నితీష్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Politics: బీజేపీతో జేడీయూ దాదాపుగా తెగదెంపులు చేసుకున్నట్లే కనిపిస్తోంది. తాజాగా ఈరోజు జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం అయ్యారు నితీష్ కుమార్. బీజేపీ కూటమితో ప్రభుత్వంలో ఉండటం తన మనుగడకే ముప్పు వాటిల్లుతోందని.. జేడీయూ అభిప్రాయపడుతోంది. దీంతో పాటు ఇటీవల ఆర్సీపీ సింగ్ వ్యవహారం కూడా జేడీయూ పార్టీకి రాజీనామా చేశారు. చేస్తూ.. చేస్తూ..నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే జేడీయూ అదిరిపోయే వార్త చెబుతానంటూ నితీష్ కుమార్ వెల్లడించినట్లు సమాచారం. ఇందుకు బలం కూర్చేలా నితీష్ కుమార్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. దీంతో బీజేపీ, జేడీయూ బంధం దాదాపుగా తెగిపోయినట్లే అని తెలుస్తోంది. అయితే చివరి ప్రయత్నంగా సీఎం నితీష్ కుమార్ కు కేంద్ర హోమంత్రి అమిత్ షా ఫోన్ చెసినట్లు తెలుస్తోంది. మరోవైపు నితీష్ కుమార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో టచ్ లో ఉన్నారు.
ఇక రాష్ట్రీయ జనతా దళ్( ఆర్జేడీ), జేడీయూతో జట్టు కట్టేందుకు సముఖంగా ఉంది. ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష ఎమ్మెల్యేల సమావేశం జరుగుతోంది. ఇటు బీజేపీ నేతలు కూడా డిప్యూటీ సీఎం తార్ కిషోర్ ప్రసాద్ నివాసంలో భేటీ అయ్యారు. బీహార్ పరిస్థితులను నిషితంగా గమనిస్తున్నారు. మరో వైపు బీజేపీకి చెందిన 16 మంది మంత్రులు రాజీనామా చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నితీష్ సారథ్యంలో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలో మహాఘట్ బంధన్ కూటమి ఏర్పాటుపై చర్చ జరుగుతోంది.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
Read Also: Kinjarapu Rammohan Naidu: ఎంపీ మాధవ్ పై చర్య తీసుకోవాల్సిందే!
గత నెల నుంచి బీజేపీపై, ఎన్డీయే కూటమిపై జేడీయూ, ముఖ్యంగా సీఎం నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్సీపీ సింగ్, నితీష్ కుమార్ కు సంబంధం లేకుండా కేంద్ర మంత్రి పదవిని తీసుకోవడం ఈ వివాదానికి మూలం అయింది. ఇటీవల ఆర్సీపీ సింగ్.. జేడీయూకు రాజీనామా చేస్తూ.. నితీష్ ఏడు జన్మలెత్తిన ప్రధాని కాలేడనే వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో బీహార్ లో పర్యటించిన కేంద్ర మంత్రి అమిత్ షా.. 2024లో నితీష్ కుమారే మా సీఎం అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రంలో జరిగే పరిణామాలు మాత్రం వేరేలా ఉన్నాయని జేడీయూ, సీఎం నితీష్ కుమార్ భావిస్తున్నారు.
ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉంటే బీజేపీకి 77, ఆర్జేడీకి 79, జేడీయూకు 45, కాంగ్రెస్ కు 19, వామపక్షాలకు 16 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. ఎంఐఎంకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో బీజేపీని కాదన్నా కూడా ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో జేడీయూ మెజారిటీ మార్క్ దాటి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!