Bihar Politics: బీజేపీతో జేడీయూ తెగదెంపులు.. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన సీఎం నితీష్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Politics: బీజేపీతో జేడీయూ దాదాపుగా తెగదెంపులు చేసుకున్నట్లే కనిపిస్తోంది. తాజాగా ఈరోజు జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం అయ్యారు నితీష్ కుమార్. బీజేపీ కూటమితో ప్రభుత్వంలో ఉండటం తన మనుగడకే ముప్పు వాటిల్లుతోందని.. జేడీయూ అభిప్రాయపడుతోంది. దీంతో పాటు ఇటీవల ఆర్సీపీ సింగ్ వ్యవహారం కూడా జేడీయూ పార్టీకి రాజీనామా చేశారు. చేస్తూ.. చేస్తూ..నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే జేడీయూ అదిరిపోయే వార్త చెబుతానంటూ నితీష్ కుమార్ వెల్లడించినట్లు సమాచారం. ఇందుకు బలం కూర్చేలా నితీష్ కుమార్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. దీంతో బీజేపీ, జేడీయూ బంధం దాదాపుగా తెగిపోయినట్లే అని తెలుస్తోంది. అయితే చివరి ప్రయత్నంగా సీఎం నితీష్ కుమార్ కు కేంద్ర హోమంత్రి అమిత్ షా ఫోన్ చెసినట్లు తెలుస్తోంది. మరోవైపు నితీష్ కుమార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో టచ్ లో ఉన్నారు.
ఇక రాష్ట్రీయ జనతా దళ్( ఆర్జేడీ), జేడీయూతో జట్టు కట్టేందుకు సముఖంగా ఉంది. ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష ఎమ్మెల్యేల సమావేశం జరుగుతోంది. ఇటు బీజేపీ నేతలు కూడా డిప్యూటీ సీఎం తార్ కిషోర్ ప్రసాద్ నివాసంలో భేటీ అయ్యారు. బీహార్ పరిస్థితులను నిషితంగా గమనిస్తున్నారు. మరో వైపు బీజేపీకి చెందిన 16 మంది మంత్రులు రాజీనామా చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నితీష్ సారథ్యంలో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలో మహాఘట్ బంధన్ కూటమి ఏర్పాటుపై చర్చ జరుగుతోంది.
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
Read Also: Kinjarapu Rammohan Naidu: ఎంపీ మాధవ్ పై చర్య తీసుకోవాల్సిందే!
గత నెల నుంచి బీజేపీపై, ఎన్డీయే కూటమిపై జేడీయూ, ముఖ్యంగా సీఎం నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్సీపీ సింగ్, నితీష్ కుమార్ కు సంబంధం లేకుండా కేంద్ర మంత్రి పదవిని తీసుకోవడం ఈ వివాదానికి మూలం అయింది. ఇటీవల ఆర్సీపీ సింగ్.. జేడీయూకు రాజీనామా చేస్తూ.. నితీష్ ఏడు జన్మలెత్తిన ప్రధాని కాలేడనే వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో బీహార్ లో పర్యటించిన కేంద్ర మంత్రి అమిత్ షా.. 2024లో నితీష్ కుమారే మా సీఎం అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రంలో జరిగే పరిణామాలు మాత్రం వేరేలా ఉన్నాయని జేడీయూ, సీఎం నితీష్ కుమార్ భావిస్తున్నారు.
ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉంటే బీజేపీకి 77, ఆర్జేడీకి 79, జేడీయూకు 45, కాంగ్రెస్ కు 19, వామపక్షాలకు 16 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. ఎంఐఎంకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో బీజేపీని కాదన్నా కూడా ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో జేడీయూ మెజారిటీ మార్క్ దాటి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!