Bihar Elections: ఈరోజే బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. సా.4 గంటలకు ఈసీ ప్రెస్మీట్
- ఈరోజే బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- సా.4 గంటలకు ఈసీ ప్రెస్మీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. శని, ఆదివారాల్లో ఎన్నికల బృందం బీహార్లో పర్యటించింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించింది. తక్కువ సమయంలో ఎన్నికలు ముగించాలని పార్టీలు కోరాయి. ఈ నేపథ్యంలో రెండు విడతల్లోనే ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు కసరత్తు చేసినట్లు సమాచారం. సాయంత్రం 4 గంటలకు బీహార్ ఎన్నికల షెడ్యూల్తో పాటు దేశంలో అనేక ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనుంది. తెలంగాణలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కూడా షెడ్యూల్ విడుదల చేయనుంది.
ఇది కూడా చదవండి: Manipur: మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు.. బీజేపీ నేతలు సమాలోచనలు
Also Read
బీహార్లో దీపావళి తర్వాత అత్యంత గ్రాండ్గా నిర్వహించే పండుగ ఛత్ పండుగ. ఈ పండుగ అక్టోబర్ 25-28 తేదీల్లో జరుగుతుంది. ఈ పండుగ కోసం రాష్ట్రం వెలుపల ఉన్న బీహారీయులంతా వచ్చేస్తారు. ఈ నేపథ్యంలో బీహారీయులు తిరిగి వేరే ప్రాంతాలకు వెళ్లకముందే ఎన్నికలు నిర్వహించాలని అన్ని పార్టీలు ఈసీని కోరాయి. అంతేకాకుండా గతంలో మాదిరిగా మూడు విడతల్లో కాకుండా తక్కువ సమయంలో ఎన్నికలు ముగించాలని.. ప్రచార భారం లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశాయి. పార్టీల అభ్యర్థన మేరకు రెండు విడతల్లో ఎన్నికల ప్రక్రియను ముగించాలని ఈసీ భావిస్తోంది. నవంబర్ మొదటి, రెండు వారాల్లో ఎన్నికలు ముగించవచ్చని సమాచారం.
పలు రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని జూబ్లీ హిల్స్, ఒడిస్సా లోని నౌపాడా, పంజాబ్లోని తరణ్ తరణ్, రాజస్థాన్లోని అంతా, జార్ఖండ్లోని ఘట్ సిలా,
మిజోరాంలోని డంపా, జమ్మూ కాశ్మీర్లోని రెండు అసెంబ్లీ స్థానాలు బడ్ గామ్, నగ్రోతాకు బైపోల్ షెడ్యూల్ విడుదల కానుంది.
ఇది కూడా చదవండి: Delhi Metro: ఢిల్లీ మెట్రోలో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్.. వీడియో వైరల్
ఇక ఈసారి ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈసీ తెలిపింది. అలాగే బూత్ల్లో 1,200 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉండరని చెప్పింది. విజయవంతంగా అన్ని నియోజకవర్గాల్లో స్పెషల్ సర్వే పూర్తైందని పేర్కొంది. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 22తో ముగుస్తుంది. ఆలోపు కంటే ముందే ఎన్నికల ప్రక్రియను ముగిస్తామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!