Bihar Elections: ఈరోజే బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. సా.4 గంటలకు ఈసీ ప్రెస్మీట్
- ఈరోజే బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- సా.4 గంటలకు ఈసీ ప్రెస్మీట్
బీహార్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. శని, ఆదివారాల్లో ఎన్నికల బృందం బీహార్లో పర్యటించింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించింది. తక్కువ సమయంలో ఎన్నికలు ముగించాలని పార్టీలు కోరాయి. ఈ నేపథ్యంలో రెండు విడతల్లోనే ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు కసరత్తు చేసినట్లు సమాచారం. సాయంత్రం 4 గంటలకు బీహార్ ఎన్నికల షెడ్యూల్తో పాటు దేశంలో అనేక ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనుంది. తెలంగాణలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కూడా షెడ్యూల్ విడుదల చేయనుంది.
ఇది కూడా చదవండి: Manipur: మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు.. బీజేపీ నేతలు సమాలోచనలు
Also Read
- Anna Hazare: ‘‘ఆత్మపరిశీలన చేసుకోవాలి’’.. ఆప్పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు..
- Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
- Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
- Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
బీహార్లో దీపావళి తర్వాత అత్యంత గ్రాండ్గా నిర్వహించే పండుగ ఛత్ పండుగ. ఈ పండుగ అక్టోబర్ 25-28 తేదీల్లో జరుగుతుంది. ఈ పండుగ కోసం రాష్ట్రం వెలుపల ఉన్న బీహారీయులంతా వచ్చేస్తారు. ఈ నేపథ్యంలో బీహారీయులు తిరిగి వేరే ప్రాంతాలకు వెళ్లకముందే ఎన్నికలు నిర్వహించాలని అన్ని పార్టీలు ఈసీని కోరాయి. అంతేకాకుండా గతంలో మాదిరిగా మూడు విడతల్లో కాకుండా తక్కువ సమయంలో ఎన్నికలు ముగించాలని.. ప్రచార భారం లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశాయి. పార్టీల అభ్యర్థన మేరకు రెండు విడతల్లో ఎన్నికల ప్రక్రియను ముగించాలని ఈసీ భావిస్తోంది. నవంబర్ మొదటి, రెండు వారాల్లో ఎన్నికలు ముగించవచ్చని సమాచారం.
పలు రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని జూబ్లీ హిల్స్, ఒడిస్సా లోని నౌపాడా, పంజాబ్లోని తరణ్ తరణ్, రాజస్థాన్లోని అంతా, జార్ఖండ్లోని ఘట్ సిలా,
మిజోరాంలోని డంపా, జమ్మూ కాశ్మీర్లోని రెండు అసెంబ్లీ స్థానాలు బడ్ గామ్, నగ్రోతాకు బైపోల్ షెడ్యూల్ విడుదల కానుంది.
ఇది కూడా చదవండి: Delhi Metro: ఢిల్లీ మెట్రోలో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్.. వీడియో వైరల్
ఇక ఈసారి ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈసీ తెలిపింది. అలాగే బూత్ల్లో 1,200 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉండరని చెప్పింది. విజయవంతంగా అన్ని నియోజకవర్గాల్లో స్పెషల్ సర్వే పూర్తైందని పేర్కొంది. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 22తో ముగుస్తుంది. ఆలోపు కంటే ముందే ఎన్నికల ప్రక్రియను ముగిస్తామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Mercedes CLA EV: భారత్ లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ CLA EV.. 792 km రేంజ్, 800V ఫాస్ట్ ఛార్జింగ్ – పూర్తి వివరాలు
-
Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
-
Anna Hazare: ‘‘ఆత్మపరిశీలన చేసుకోవాలి’’.. ఆప్పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు..
-
Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
-
Six Sigma Health Care Group: సెల్ హెల్త్ క్లినిక్ కు.. సిక్స్ సిగ్మా హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!