Bihar Elections: ఈరోజే బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. సా.4 గంటలకు ఈసీ ప్రెస్మీట్
- ఈరోజే బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- సా.4 గంటలకు ఈసీ ప్రెస్మీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. శని, ఆదివారాల్లో ఎన్నికల బృందం బీహార్లో పర్యటించింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించింది. తక్కువ సమయంలో ఎన్నికలు ముగించాలని పార్టీలు కోరాయి. ఈ నేపథ్యంలో రెండు విడతల్లోనే ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు కసరత్తు చేసినట్లు సమాచారం. సాయంత్రం 4 గంటలకు బీహార్ ఎన్నికల షెడ్యూల్తో పాటు దేశంలో అనేక ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనుంది. తెలంగాణలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కూడా షెడ్యూల్ విడుదల చేయనుంది.
ఇది కూడా చదవండి: Manipur: మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు.. బీజేపీ నేతలు సమాలోచనలు
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
- Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
బీహార్లో దీపావళి తర్వాత అత్యంత గ్రాండ్గా నిర్వహించే పండుగ ఛత్ పండుగ. ఈ పండుగ అక్టోబర్ 25-28 తేదీల్లో జరుగుతుంది. ఈ పండుగ కోసం రాష్ట్రం వెలుపల ఉన్న బీహారీయులంతా వచ్చేస్తారు. ఈ నేపథ్యంలో బీహారీయులు తిరిగి వేరే ప్రాంతాలకు వెళ్లకముందే ఎన్నికలు నిర్వహించాలని అన్ని పార్టీలు ఈసీని కోరాయి. అంతేకాకుండా గతంలో మాదిరిగా మూడు విడతల్లో కాకుండా తక్కువ సమయంలో ఎన్నికలు ముగించాలని.. ప్రచార భారం లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశాయి. పార్టీల అభ్యర్థన మేరకు రెండు విడతల్లో ఎన్నికల ప్రక్రియను ముగించాలని ఈసీ భావిస్తోంది. నవంబర్ మొదటి, రెండు వారాల్లో ఎన్నికలు ముగించవచ్చని సమాచారం.
పలు రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని జూబ్లీ హిల్స్, ఒడిస్సా లోని నౌపాడా, పంజాబ్లోని తరణ్ తరణ్, రాజస్థాన్లోని అంతా, జార్ఖండ్లోని ఘట్ సిలా,
మిజోరాంలోని డంపా, జమ్మూ కాశ్మీర్లోని రెండు అసెంబ్లీ స్థానాలు బడ్ గామ్, నగ్రోతాకు బైపోల్ షెడ్యూల్ విడుదల కానుంది.
ఇది కూడా చదవండి: Delhi Metro: ఢిల్లీ మెట్రోలో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్.. వీడియో వైరల్
ఇక ఈసారి ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈసీ తెలిపింది. అలాగే బూత్ల్లో 1,200 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉండరని చెప్పింది. విజయవంతంగా అన్ని నియోజకవర్గాల్లో స్పెషల్ సర్వే పూర్తైందని పేర్కొంది. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 22తో ముగుస్తుంది. ఆలోపు కంటే ముందే ఎన్నికల ప్రక్రియను ముగిస్తామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!