BIhar: సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి.. 13 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar CM convoy attacked, 13 people arrested: బీజేపీతో పొత్తు తెంచుకుని ఆర్జేడీ పొత్తుతో మళ్లీ నితీష్ కుమార్ ఎనిమిదో సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు, ఇతర కార్యక్రమాలపై పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు నితీష్ కుమార్. ఇదిలా ఉండగా.. ఆదివారం నితీష్ కుమార్ కాన్వాయ్ పై రాళ్లదాడి జరిగింది. ఈ దాడిలో నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి. అయితే కాన్వాయ్ లో ఆ సమయంలో నితీష్ కుమార్ లేరు.
పాట్నా-గయ మార్గంలో గౌరీచ్ లోని సోహ్గి గ్రామం వద్ద మూకుమ్మడి పలువురు కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం గయలో నితీష్ కుమార్ పర్యటన ఉంది. గయలో నిర్మిస్తున్న రబ్బర్ డ్యామ్ పరిశీలించేందుకు వెళ్లనున్నారు. అయితే దీని కోసం కాన్వాయ్ గయకు వెళ్తున్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రెండు మూడు రోజులుగా తప్పిపోయిన యువకుడు శవమై కనిపించడంతో ఆగ్రహంతో ఉన్న గుంపు పాట్నా-గయా రోడ్డును అడ్డుకుందని.. ఈ సమయంలోనే కాన్వాయ్ పై దాడి జరిగినట్లు పాట్నా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ వెల్లడించారు.
Also Read
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
Read Also: Mobile Usage: ఇండియాలో సగటున పెరిగిన మొబైల్ వినియోగం.. ఎక్కువమంది చూసేవి ఏంటంటే?
అయితే ఈ ఘటనపై జేడీయూ-ఆర్జేడీ మహాగటబంధన్ కూటమిపై విమర్శలు గుప్పిస్తోంది బీజేపీ. బీహార్ లో మళ్లీ అక్రమార్కుల రోజుల వచ్చాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం అని విమర్శించింది. మరికొంత మంది ఈ దాడిని బీజేపీ కుట్రగా అభివర్ణించారు. ఇటీవల ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ, కాంగ్రెస్ సహకారంతో మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా.. మొత్తం 31 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ బీహార్ లో జంగిల్ రాజ్ పాలన వచ్చిందని.. బీజేపీ విమర్శిస్తోంది.
Bihar | A total of 13 accused have been arrested in connection with stone-pelting at the convoy of Bihar CM Nitish Kumar yesterday: SSP Patna https://t.co/vPUyPwI32X
— ANI (@ANI) August 22, 2022
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!