Bihar: లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్.. ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBI raids on RJD leaders in bihar: ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా బీహార్ లో సీబీఐ దాడులు జరిగాయి. బుధవారం రోజు తెల్లవారుజామున ఆర్జేడీ నేతల ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. యూపీఏ 1 గవర్నమెంట్ లో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పనిచేసిన కాలంలో వెలుగులోకి వచ్చిన ‘ఉద్యోగాల కోసం భూములు’ స్కామ్ లో ముగ్గురు ఆర్జేడీ సీనియర్ నేతల ఇళ్లలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దాడులు చేసింది.
ఆర్జేడీకి చెందిన రాజ్యసభ ఎంపీ అహ్మద్అష్ఫాక్ కరీం, ఎమ్మెల్సీ సునీల్ సింగ్, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ సుబోధ్ రాయ్ ఇళ్లలో సీబీఐ బృందాలు సోదాలు చేశాయి. బుధవారం ఉదయం నుంచే వీరిద్దరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది సీబీఐ. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దాడిగా అభివర్ణించారు సునీల్ సింగ్. ఆర్జేడీ ఎమ్మెల్యే భయపడి బీజేపీతో చేరుతారనే ఆశతో ఇలా చేస్తున్నారని ఆయన అన్నారు. ఇది బీజేపీ దాడి అని.. ఈడీ, సీబీఐ, ఐటీలు బీజేపీ కింద పని చేస్తున్నాయని.. బీజేపీ స్క్రిప్టుతోనే నడుస్తున్నాయని.. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా విమర్శించారు.
Also Read
Read Also: Eatala Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఇంట విషాదం.. అనారోగ్యంతో తండ్రి మృతి
ఇటీవల బీహార్ లో బీజేపీ పొత్తును వీడి జేడీయూ, ఆర్జేడీతో పొత్తు పెట్టుకుంది. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం రోజు నితీష్ కుమార్ బీహార్ అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోనున్నారు. ఇదే రోజు సీబీఐ దాడులు చేయడాన్ని ఆర్జేడీ విమర్శిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులు చేయిస్తోందని విమర్శించింది.
లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న 2004-09 సమయంలో లాలూ కుటుంబ సభ్యులు రైల్వే ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భూములను లంచంగా తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సీబీఐ ఆర్జేడీ నేతల ఇళ్లపై దాడులు చేస్తోంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!