Bihar Politics: సీఎంగా నితీష్ కుమార్, 19-20 తేదీల్లో ప్రమాణ స్వీకారం..?
- బీహార్ ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే సిద్ధం..
- మళ్లీ నితీష్ కుమారే సీఎం, ఇప్పటికే క్యాబినెట్ ఫార్ములా పూర్తి..
- 19-20 తేదీల్లో ప్రమాణ స్వీకారం జరిగే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Politics: బీహార్లో ఘన విజయం తర్వాత ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. నితీష్ కుమార్ సీఎంగా కొనసాగుతారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో క్యాబినెట్ ఫార్ములా కూడా సిద్ధమైంది. మరో మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని భావిస్తున్నారు.ఎన్డీయే ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమం బుధవారం లేదా గురువారం జరుగుతుందని, ఇది ప్రధాని నరేంద్రమోడీ షెడ్యూల్పై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
Read Also: Bhagyashri Borse : భాగ్యశ్రీ ఖాతాలో మరో ప్లాప్.. కనికరం చూపని కాంత
Also Read
- Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు
- NDA Women Cadets: భారత రక్షణ రంగంలో నయా హిస్టరీ.. చరిత్ర సృష్టించిన నారీమణులు! ‘ఎన్డీఏ’ తొలి మహిళా సింహాలు వీరే..
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Modi-Trump Meet: ఫ్రాన్స్లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్హౌజ్..
బీహార్ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూల కూటమి సంచలన విజయం సాధించింది. 243 సీట్లలో ఏకంగా 202 స్థానాలు కైవసం చేసుకుంది. ఆర్జేడీ, కాంగ్రెస్లను క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 85 సీట్లు సాధించింది. ఇదిలా ఉంటే, 18వ బీహార్ అసెంబ్లీ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ కావడంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ఈ నేపధ్యంలో నితీష్ కుమార్ రేపు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. 17వ అసెంబ్లీ రద్దును ఈ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీని తర్వాత నితీష్ కుమార్ తన రాజీనామాను గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్కు సమర్పిస్తారు. దీంతో, తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.
ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు గవర్నర్కు సమాచారం ఇవ్వనున్నారు. ప్రధాని మోడీ షెడ్యూల్ ఆధారంగా నవంబర్ 19-20లలో తేదీలను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే, పాట్నాలోని గాంధీ మైదానంలో సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
తాజావార్తలు
-
Shubman Gill: “డోంట్ వర్రీ”.. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
WiFi Signal Issues : ఇంట్లో వైఫై స్పీడ్ తగ్గిపోతుందా? కారణం ఇంటర్నెట్ మాత్రమే కాదు.. ఈ విషయాలు కూడా చెక్ చేయండి!
-
Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
-
ChatGPT: చాట్ జీపీటీ వాడుతున్నారా?.. భారీ నష్టం తప్పదు!.. AI పాయిజనింగ్ ముప్పు గురించి తెలుసుకోండి
-
Modi-Trump Meeting: మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు.. 16 నెలల తరువాత ఎదురుపడనున్న మోడీ, ట్రంప్..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!