Big Shock: బీహార్ ఎన్నికల వేళ లాలూ ఫ్యామిలీకి బిగ్ షాక్.. ఐఆర్సీటీసీ కేసులో ఎదురుదెబ్బ
- బీహార్ ఎన్నికల వేళ లాలూ ఫ్యామిలీకి బిగ్ షాక్
- ఐఆర్సీటీసీ కేసులో ఎదురుదెబ్బ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో హైవోల్టేజ్ ఎన్నికల వేళ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. ఐఆర్సీటీసీ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, భార్య రబ్రీ దేవిపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అభియోగాలు మోపింది. మోసం, నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్ల కింద, అలాగే అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది. మోసం, కుట్ర నేరం కింద ఐపీసీ సెక్షన్లు 420, 120 బీ కింద అభియోగాలు మోపింది. అయితే తాము నిర్దోషులమని.. ఈ కేసు తప్పుడు కేసు అని రబ్రీ దేవి కొట్టిపారేశారు.
ఇది కూడా చదవండి: Karur Stampede: కరూర్ తొక్కిసలాటపై కీలక పరిణామం.. సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Also Read
- PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
2004-2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టుల కేటాయింపులో అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. రెండు ఐఆర్సీటీసీ హాటళ్లు, బీఎన్ఆర్ రాంచీ, బీఎన్ఆర్ పూరీల నిర్వహణ కాంట్రాక్టును సుజాత హోటల్కు అప్పగించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఒప్పందానికి ఉపకారంగా ఒక బినామీ కంపెనీ ద్వారా మూడు ఎకరాల ప్రధాన భూమిని లాలూ కుటుంబం పొందినట్లుగా సీబీఐ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Hamas-Israel: ఇజ్రాయెల్లో పండుగ వాతావరణం.. రెండేళ్ల తర్వాత బందీల విడుదల
2017లో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. నిందితులందరిపై అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ కోర్టుకు సీబీఐ తెలిపింది. అభియోగాలు మోపడానికి ఎటువంటి ఆధారాలు లేవని, టెండర్లు న్యాయంగా జరిగాయని లాలూ యాదవ్ తరపు న్యాయవాది వాదించారు. తాజాగా ఢిల్లీ కోర్టు అభియోగాలు నమోదు చేసింది.
ప్రస్తుతం ఈ పరిణామం ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారనున్నట్లు కనిపిస్తోంది. లాలూ ఫ్యామిలీపై అవినీతి అస్త్రంగా ప్రత్యర్థి పార్టీలు ప్రయోగించే అవకాశం ఉంది. ఎన్నికల్లో ప్రత్యర్థులు.. ఆర్జేడీని అస్త్రంగా ఉపయోగించుకోవచ్చు.
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మాత్రం నవంబర్ 14న జరగనుంది. ఓ వైపు ఎన్డీఏ-ఇండియా కూటమిలు నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ చేస్తుండగా.. ఇంకోవైపు ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల అరంగ్రేటంతో పోరాడుతున్నారు. అయితే ఈసారి ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!