Bhagwant Mann: మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన సీఎం..?
- అసెంబ్లీకి తాగి వచ్చిన సీఎం భగవంత్ మాన్.?
- సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్, అకాలీ దళ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagwant Mann: కార్మిక దినోత్సవం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పంజాబ్లో సంచలనంగా మారాయి. ఈ సమావేశాల సందర్భంగా సీఎం భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు హాజరయ్యారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో పంజాబ్ అసెంబ్లీలో ఉద్రిక్తతలు చెలరేగాయి. ముఖ్యమంత్రి మద్యం మత్తులో అసెంబ్లీకి వచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించడంతో వివాదం ఏర్పడింది. ఎమ్మెల్యేలందరికి ఆల్కాహాల్ మీటర్ టెస్ట్ నిర్వహించాలని ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బాజ్వా డిమాండ్ చేశారు.
Read Also: Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
శిరోమణి అకాలీ దళ్ కూడా ముఖ్యమంత్రి మాన్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. కార్మిక దినోత్సవం రోజు భగవంత్ మాన్ మద్యం సేవించి అసెంబ్లీకి రావడం చాలా సిగ్గుచేటు అని ఆ పార్టీ పేర్కొంది. సభలో ముఖ్యమంత్రి తీరును ప్రజలు గమనించాలని అన్నారు. నిజం బయటపెట్టేందుకు పంజాబ్ సీఎంకు ప్రజల ముందు డోప్ టెస్ట్ నిర్వహించాలని అకాలీ దళ్ డిమాండ్ చేసింది.
ఇటీవల ఆప్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతో పాటు ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో ఒక్కసారిగా ఆ పార్టీలో కలకలం చెలరేగింది. తాజాగా సీఎం భగవంత్ మాన్పై ఇలాంటి విమర్శలు రావడంతో మరోసారి ఆ పార్టీ వివాదంలో చిక్కుకుంది. ఈ ఆరోపణలపై భగవంత్ మాన్ స్పందిస్తూ, ప్రత్యేక సమావేశం కార్మిక దినోత్సవానికి అంకితమని, సభ్యులందరూ వాదనలకు దూరంగా ఉండి సభలో హుందాతనాన్ని పాటించాలని కోరారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!