NTV Telugu Site icon

Bengaluru Metro: ప్రయాణికులపై మెట్రో బాదుడు.. భారీగా పెరిగిన ఛార్జీలు

Bengalurumetro

Bengalurumetro

ప్రయాణికులపై బెంగళూరు మెట్రో ఛార్జీల బాదుడు వేసింది. ఫిబ్రవరి 8న ఒకేసారి భారీగా ఛార్జీలు పెంచేసింది. గరిష్ట ఛార్జీ రూ. 60 నుంచి రూ.90కి పెంచేసింది. స్మార్ట్ కార్డ్ వినియోగదారుకు మాత్రం 5 శాతం తగ్గింపు లభిస్తుందని అధికారులు తెలిపారు. పెంచిన కొత్త ఛార్జీలు ఆదివారం (ఫిబ్రవరి 9) నుంచి అమల్లోకి రానున్నాయి. తక్కువ దూరాలకు (0-2 కి.మీ) ఛార్జీని రూ.10 ఉంచారు. 30 కి.మీ దాటిన ప్రయాణాలకు గరిష్ట ఛార్జీని ఇప్పుడు రూ.60 నుంచి రూ.90గా నిర్ణయించారు.