Bengaluru Shocking: ఇంట్లో లివ్-ఇన్ జంట మృతి! దర్యాప్తులో ఏం తేలిందంటే..!
- బెంగళూరులో ఓ షాకింగ్ సంఘటన
- ఇంట్లో లివ్-ఇన్ జంట మృతి!
- దర్యాప్తులో ఏం తేలిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో లివ్-ఇన్ జంట అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆనేకల్లోని కల్లబాలులోని ఓ ఇంట్లో శవాలుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరులోని ఒక అద్దె ఇంట్లో జంట నివాసం ఉంటుంది. మంగళవారం శవాలుగా కనిపించారని పోలీసులు తెలిపారు. దీపావళి రోజున (అక్టోబర్ 20) ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఘర్షణ తర్వాత ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆదివారం నుంచే ఇంటి తలుపులు తీయడం లేదని ఇరుగుపొరుగు వారు చెప్పారు. అనుమానం రావడంతోనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికొచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఇద్దరి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి.
Also Read
ఇది కూాడా చదవండి: Modi-Trump: బలపడుతున్న భారత్-అమెరికా బంధం.. సుంకాలు తగ్గే అవకాశం
మృతులిద్దరూ ఒడిశాకుచెందిన రాకేష్ కుమార్ (23), సీమా నాయక్ (25) గా పోలీసులు గుర్తించారు. ఉద్యోగాల కోసం మూడు నెలల క్రితం అనేకల్కు వచ్చారని స్నేహితులు తెలిపారు. 10 రోజుల క్రితమే జంట అద్దె ఇల్లు తీసుకున్నట్లు వెల్లడించారు. రాకేష్ కుమార్ సమీపంలోని ఓ ప్రైవేటు కంపెనీలో హౌస్ కీపింగ్ పని చేస్తుండగా.. సీమా నాయక్ ఇంటి సమీపంలో ఉన్న సూపర్ మార్కెట్లో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూాడా చదవండి: Tejashwi Yadav: తేజస్వి యాదవ్ హామీల వర్షం.. జీవికా దీదీలకు రూ.30 వేలు ఇస్తామని ప్రకటన
తొలుత రాకేష్ కుమార్ ఉరి వేసుకున్నాడు. వెంటనే సీమా నాయక్ అప్రమత్తమై కత్తి తీసుకుని ఉరి తాడును కత్తిరించే ప్రయత్నం చేసింది. అప్పటికే అతడు చనిపోయాడని తెలుసుకుని ఆమె కూడా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. రాకేష్ కుమార్ ఆదివారం మద్యం తాగి వచ్చి భాగస్వామితో గొడవకు దిగినట్లుగా సమాచారం. అనంతరం అర్ధరాత్రే ఇద్దరూ ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
సీమా నాయక్కు అక్రమ సంబంధం ఉందని రాకేష్ కుమార్ అనుమానించాడని.. సీమా వేరే వ్యక్తికి డబ్బులు బదిలీ చేసిందని రాకేష్ కుమార్ స్నేహితుడు జోరా నాయక్ తెలిపాడు. అక్రమ సంబంధంపై ప్రతిరోజూ ఇద్దరి మధ్య గొడవులు జరుగుతున్నాయని చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఒడిశాలోని బంధువులకు సమాచారం అందించారు.
తాజావార్తలు
-
FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. ‘జొనాథన్ డేవిడ్’ హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్పై 6-0 భారీ విజయం.!
-
Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
-
Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
60 Years of Shiv Sena: 60 ఏళ్లలో 6 ముక్కలైన శివసేన.. ఆవిరైన బాలాసాహెబ్ ఆశయాలు?
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!