Bengaluru: ఐఐఎం-బీలో కుల వివక్ష.. డైరెక్టర్ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు
- బెంగళూరు ఐఐఎం-బీలో కుల వివక్ష
- డైరెక్టర్ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై ఎఫ్ఐఆర్
- బాధితుడికి న్యాయమే చేశామని సంస్థ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులోని ప్రముఖ విద్యాసంస్థ ఐఐఎం-బీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్)లో కుల వివక్ష తీవ్ర కలకలం రేపింది. దీంతో ఐఐఎంబీ డైరెక్టర్ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు నమోదైనట్లు శనివారం బెంగళూరు పోలీసులు వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల చట్టం మరియు న్యాయ సంహిత నిబంధనలను ఐఐఎంబీ సిబ్బంది ఉల్లంఘించారని పేర్కొంది.
ఐఐఎంబీలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన గోపాల్ దాస్.. కుల వివక్ష కారణంగా తాను ప్రమోషన్ కోల్పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎనిమిది మంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తన కులాన్ని కార్యాలయంలో బహిర్గతం చేశారని.. కావాలని ప్రచారం చేశారని ఆరోపించారు. తనకు దక్కాల్సిన అవకాశాలను నిరాకరించారని.. అంతేకాకుండా మానసిక వేధింపులతో పాటు బెదిరింపులకు గురి చేశారని దాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పోలీసులు ఫిర్యాదు ఆధారంగా డైరెక్టర్ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై కేసు నమోదు చేశారు. అయితే శుక్రవారమే వారంతా అరెస్ట్పై స్టే తెచ్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాధితుడి ఫిర్యాదు ఆధారంగా చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర పోలీస్ చీఫ్ను సాంఘిక సంక్షేమ శాఖ ఆదేశించింది.
Also Read
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
- NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
- PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
- Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..
ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశామని.. అయితే ఎఫ్ఐఆర్లో నమోదైన పేర్లు గలవారు అదేరోజు సాయంత్రం కోర్టు నుంచి స్టే ఆర్డర్ పొందారని తెలిపారు. కానీ తమకు ఇంకా ఆర్డర్ కాపీ అందలేదని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
అయితే కొంత మంది విద్యార్థులు.. దాస్పై వేధింపుల ఫిర్యాదులు చేశారని.. అందుకోసమే దాస్ ప్రమోషన్ దరఖాస్తును తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఐఐఎంబీ స్పష్టం చేసింది. గోపాల్ దాస్.. 2018లో ఐఐఎంబీలో చేరినప్పటి నుంచి సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లు సంస్థ తెలిపింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. అతని అర్హతలను బట్టి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టునే ఆఫర్ చేసినట్లు ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. అర్హతలు, అనుభవం, 7వ కేంద్ర వేతన సంఘం ప్రకారం జీతం, పరిశోధన, బోధన మరియు వివిధ ప్రోత్సాహకాలను పొందారని తెలిపింది. అంతేకాకుండా ఇనిస్టిట్యూట్లో రివ్యూ బోర్డు చైర్పర్సన్, కెరీర్ డెవలప్మెంట్ సర్వీసెస్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు కూడా అప్పగించినట్లు సంస్థ వివరించింది. ఇక బోధనలో అయితే దాస్కు నచ్చిన కోర్సులనే బోధించాడని పేర్కొంది. ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాలపై చర్యలు తీసుకుంటామని ఐఐఎంబీ తెలిపింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!