Bengaluru: ఐఐఎం-బీలో కుల వివక్ష.. డైరెక్టర్ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు
- బెంగళూరు ఐఐఎం-బీలో కుల వివక్ష
- డైరెక్టర్ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై ఎఫ్ఐఆర్
- బాధితుడికి న్యాయమే చేశామని సంస్థ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులోని ప్రముఖ విద్యాసంస్థ ఐఐఎం-బీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్)లో కుల వివక్ష తీవ్ర కలకలం రేపింది. దీంతో ఐఐఎంబీ డైరెక్టర్ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు నమోదైనట్లు శనివారం బెంగళూరు పోలీసులు వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల చట్టం మరియు న్యాయ సంహిత నిబంధనలను ఐఐఎంబీ సిబ్బంది ఉల్లంఘించారని పేర్కొంది.
ఐఐఎంబీలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన గోపాల్ దాస్.. కుల వివక్ష కారణంగా తాను ప్రమోషన్ కోల్పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎనిమిది మంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తన కులాన్ని కార్యాలయంలో బహిర్గతం చేశారని.. కావాలని ప్రచారం చేశారని ఆరోపించారు. తనకు దక్కాల్సిన అవకాశాలను నిరాకరించారని.. అంతేకాకుండా మానసిక వేధింపులతో పాటు బెదిరింపులకు గురి చేశారని దాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పోలీసులు ఫిర్యాదు ఆధారంగా డైరెక్టర్ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై కేసు నమోదు చేశారు. అయితే శుక్రవారమే వారంతా అరెస్ట్పై స్టే తెచ్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాధితుడి ఫిర్యాదు ఆధారంగా చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర పోలీస్ చీఫ్ను సాంఘిక సంక్షేమ శాఖ ఆదేశించింది.
Also Read
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశామని.. అయితే ఎఫ్ఐఆర్లో నమోదైన పేర్లు గలవారు అదేరోజు సాయంత్రం కోర్టు నుంచి స్టే ఆర్డర్ పొందారని తెలిపారు. కానీ తమకు ఇంకా ఆర్డర్ కాపీ అందలేదని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
అయితే కొంత మంది విద్యార్థులు.. దాస్పై వేధింపుల ఫిర్యాదులు చేశారని.. అందుకోసమే దాస్ ప్రమోషన్ దరఖాస్తును తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఐఐఎంబీ స్పష్టం చేసింది. గోపాల్ దాస్.. 2018లో ఐఐఎంబీలో చేరినప్పటి నుంచి సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లు సంస్థ తెలిపింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. అతని అర్హతలను బట్టి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టునే ఆఫర్ చేసినట్లు ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. అర్హతలు, అనుభవం, 7వ కేంద్ర వేతన సంఘం ప్రకారం జీతం, పరిశోధన, బోధన మరియు వివిధ ప్రోత్సాహకాలను పొందారని తెలిపింది. అంతేకాకుండా ఇనిస్టిట్యూట్లో రివ్యూ బోర్డు చైర్పర్సన్, కెరీర్ డెవలప్మెంట్ సర్వీసెస్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు కూడా అప్పగించినట్లు సంస్థ వివరించింది. ఇక బోధనలో అయితే దాస్కు నచ్చిన కోర్సులనే బోధించాడని పేర్కొంది. ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాలపై చర్యలు తీసుకుంటామని ఐఐఎంబీ తెలిపింది.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!