Bengal poll violence: బెంగాల్లో ఆగని హత్యా రాజకీయాలు.. 17 ఏళ్ల టీఎంసీ కార్యకర్త హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal poll violence: పశ్చిమ బెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు రక్తపాతానికి కేంద్రం అవుతున్నాయి. ముఖ్యంగా అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీల మధ్య హత్యారాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు దుండగులు జరిపిన దాడుల్లో మరణిస్తున్నారు. అయితే ఇరు పార్టీలు కూడా మీరంటే, మీరంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇదిలా ఉంటే 17 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన కార్యకర్త దారుణంగా హత్యకు గురయ్యాడు.
Read Also: Chikoti Praveen: మరోసారి తెరపైకి చీకోటి ప్రవీణ్.. గజ్వేల్లో కేసు నమోదు
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
నార్త్ 24 పరగణ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన దాడిలో 17 ఏళ్ల ఇమ్రాన్ హసన్ మరణించాడు. టీఎంసీ ఊరేగింపులో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడిపై దుండగులు బాంబులు విసరడంతో మరణించాడు. ఈ ఘటన దేగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 11వ తరగతి చదువుతున్న ఇమ్రాన్ హసన్ అనే విద్యార్థి టీఎంసీ కార్యకర్త. అతడిని ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు తెలుస్తోంది. బాంబు దాడితో అతని ఛాతిపై తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడికి సీపీఎం, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ తమ కార్యకర్తలు తమపై దాడికి తెగబడ్డారని ప్రత్యక్ష సాక్షి మహ్మద్ హలీమ్ మండల్ ఆరోపించారు. టీఎంసీ ఊరేగింపు జరిగిన తర్వాత తిరిగి వస్తున్న క్రమంలో దుండగులు స్కూల్ పైకప్పు, జహంగీర్ ఘాజీ అనే వ్యక్తి ఇంటిపై నుంచి బాంబులు విసిరినట్లు ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ లో జూలై 8న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. టీఎంసీ, బీజేపీలు ఇరు పక్షాలు దాడులు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల్లో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు మరణిస్తున్నారు. టీఎంసీ హత్యారాజకీయాలకు పాల్పడుతుందని బీజేపీ ఆరోపించింది. మరోవైపు కలకత్తా హైకోర్టు ఈ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!