Bengal poll violence: బెంగాల్లో ఆగని హత్యా రాజకీయాలు.. 17 ఏళ్ల టీఎంసీ కార్యకర్త హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal poll violence: పశ్చిమ బెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు రక్తపాతానికి కేంద్రం అవుతున్నాయి. ముఖ్యంగా అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీల మధ్య హత్యారాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు దుండగులు జరిపిన దాడుల్లో మరణిస్తున్నారు. అయితే ఇరు పార్టీలు కూడా మీరంటే, మీరంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇదిలా ఉంటే 17 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన కార్యకర్త దారుణంగా హత్యకు గురయ్యాడు.
Read Also: Chikoti Praveen: మరోసారి తెరపైకి చీకోటి ప్రవీణ్.. గజ్వేల్లో కేసు నమోదు
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
నార్త్ 24 పరగణ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన దాడిలో 17 ఏళ్ల ఇమ్రాన్ హసన్ మరణించాడు. టీఎంసీ ఊరేగింపులో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడిపై దుండగులు బాంబులు విసరడంతో మరణించాడు. ఈ ఘటన దేగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 11వ తరగతి చదువుతున్న ఇమ్రాన్ హసన్ అనే విద్యార్థి టీఎంసీ కార్యకర్త. అతడిని ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు తెలుస్తోంది. బాంబు దాడితో అతని ఛాతిపై తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడికి సీపీఎం, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ తమ కార్యకర్తలు తమపై దాడికి తెగబడ్డారని ప్రత్యక్ష సాక్షి మహ్మద్ హలీమ్ మండల్ ఆరోపించారు. టీఎంసీ ఊరేగింపు జరిగిన తర్వాత తిరిగి వస్తున్న క్రమంలో దుండగులు స్కూల్ పైకప్పు, జహంగీర్ ఘాజీ అనే వ్యక్తి ఇంటిపై నుంచి బాంబులు విసిరినట్లు ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ లో జూలై 8న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. టీఎంసీ, బీజేపీలు ఇరు పక్షాలు దాడులు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల్లో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు మరణిస్తున్నారు. టీఎంసీ హత్యారాజకీయాలకు పాల్పడుతుందని బీజేపీ ఆరోపించింది. మరోవైపు కలకత్తా హైకోర్టు ఈ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
-
Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
-
Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
-
OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!