Sandeshkhali: సందేశ్ఖాలీ ఉద్రిక్తం.. పోలీసు ఘర్షణలో బీజేపీ చీఫ్కి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandeshkhali: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్ అఘాయిత్యాలపై అక్కడి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళన, నిరసన కార్యక్రమాలకు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఇటీవల ఉత్తర 24 పరగణాల్లోని సందేశ్ఖాలీ ప్రాంతంలో రేషన్ కుంభకోణం విచారణ సందర్భంగా ఈడీ అధికారులు వెళ్తే, వారిపై షాజహాన్, అతని గుండాలు దాడులకు పాల్పడ్డారు. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. ఈ ఘటన నేపథ్యంలో అతని అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ ప్రాంతంలో మహిళలపై షాజహాన్, అతని అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా అతడిని అరెస్ట్ చేయాలని బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.
Read Also: Soniya Gandhi: జైపూర్లో రాజ్యసభకు సోనియా నామినేషన్
Also Read
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- Vijay: విజయ్కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
రాష్ట్ర బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్, మహిళలను పరామర్శించేందుకు ప్రయత్నించిన సమయంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాల మధ్య తోపులాటలో మంజుందార్ గాయపడి, స్పృహతప్పి వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర బిజెపి చీఫ్ మరియు ఇతర పార్టీ కార్యకర్తలు సందేశ్ఖాలీని సందర్శించడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ బసిర్హట్లోని పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం వెలుపల నిరసన ప్రదర్శన నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ స్థానిక యంత్రాంగం ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించింది.
సందేశ్ఖాలీలో టీఎంసీ కార్యకర్తలు నెలల తరబడి మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు, షేక్ షాహాన్, శిబు హజ్రా, ఉత్తమ్ సర్దార్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, వారిని అరెస్ట్ చేయాలని ఎస్పీని కోరేందుకు వచ్చామని, అరెస్ట్ చేయకపోతే మహిళల పరిస్థితి ఏంటని మంగళవారం మజుందార్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ..మమతా బెనర్జీ రాజకీయ ప్రయోజనాల కోసం నేరస్తుల్ని కాపాడుతోందని ఆరోపించారు. మరోవైపు బీజేపీ ప్రశాంత వాతావరణాన్ని పాడుచేస్తోందని, నిరాధార ఆరోపణలు చేస్తోందని టీఎంసీ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!