Sandeshkhali: సందేశ్ఖాలీ ఉద్రిక్తం.. పోలీసు ఘర్షణలో బీజేపీ చీఫ్కి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandeshkhali: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్ అఘాయిత్యాలపై అక్కడి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళన, నిరసన కార్యక్రమాలకు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఇటీవల ఉత్తర 24 పరగణాల్లోని సందేశ్ఖాలీ ప్రాంతంలో రేషన్ కుంభకోణం విచారణ సందర్భంగా ఈడీ అధికారులు వెళ్తే, వారిపై షాజహాన్, అతని గుండాలు దాడులకు పాల్పడ్డారు. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. ఈ ఘటన నేపథ్యంలో అతని అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ ప్రాంతంలో మహిళలపై షాజహాన్, అతని అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా అతడిని అరెస్ట్ చేయాలని బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.
Read Also: Soniya Gandhi: జైపూర్లో రాజ్యసభకు సోనియా నామినేషన్
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
రాష్ట్ర బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్, మహిళలను పరామర్శించేందుకు ప్రయత్నించిన సమయంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాల మధ్య తోపులాటలో మంజుందార్ గాయపడి, స్పృహతప్పి వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర బిజెపి చీఫ్ మరియు ఇతర పార్టీ కార్యకర్తలు సందేశ్ఖాలీని సందర్శించడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ బసిర్హట్లోని పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం వెలుపల నిరసన ప్రదర్శన నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ స్థానిక యంత్రాంగం ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించింది.
సందేశ్ఖాలీలో టీఎంసీ కార్యకర్తలు నెలల తరబడి మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు, షేక్ షాహాన్, శిబు హజ్రా, ఉత్తమ్ సర్దార్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, వారిని అరెస్ట్ చేయాలని ఎస్పీని కోరేందుకు వచ్చామని, అరెస్ట్ చేయకపోతే మహిళల పరిస్థితి ఏంటని మంగళవారం మజుందార్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ..మమతా బెనర్జీ రాజకీయ ప్రయోజనాల కోసం నేరస్తుల్ని కాపాడుతోందని ఆరోపించారు. మరోవైపు బీజేపీ ప్రశాంత వాతావరణాన్ని పాడుచేస్తోందని, నిరాధార ఆరోపణలు చేస్తోందని టీఎంసీ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!