Tabletop runway: అజిత్ పవార్ మరణానికి “టేబుల్టాప్ రన్వే” కారణమా..?
- అజిత్ పవార్ మృతికి ‘‘టేబుల్-టాప్ రన్వే’’ కారణమా..?
- గతంలో కూడా ఇలాంటి రన్వేలపై చాలా ప్రమాదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tabletop runway: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఘోర విమాన ప్రమాదంలో మరణించారు. స్థానిక ఎన్నికల ప్రచారం కోసం ముంబై నుంచి బారామతికి ఆయన ప్రయాణించిన విమానం, ల్యాండింగ్కు కొన్ని క్షణాల ముందు కుప్పకూలింది. రన్ వే పక్కనే క్రాష్ కావడం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే, ఈ ప్రమాదంపై పౌర విమానయాన శాఖ దర్యాప్తు చేస్తోంది.
అయితే, ఈ ప్రమాదానికి బారామతిలో ఉన్న ‘‘టేబుల్ టాప్ రన్వే’’నే కారణమా.? అనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టేబుల్ టాప్ రన్వేలు కలిగిన విమానాశ్రయాల్లోనే అత్యధిక ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
సాధారణంగా చుట్టుపక్కల ప్రాంతాల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండే రన్ వేలను ఈ పేరుతో వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, పర్వతాల ప్రాంతాల్లో ఉండే విమానాశ్రయాలు టేబుల్ టాప్ రన్ వేలను కలిగి ఉంటాయి. ఈ రన్ వేలు చిన్నగా ఉండటంతో పైలెట్లకు టేకాఫ్, ల్యాండిగ్ అనేది ఇబ్బందితో కూడుకున్న విషయం. ఒకవేళ ఎక్కువ రన్ వేని ఉపయోగించుకునే పక్షంలో విమానం క్రాష్ అవుతుంది. మంగళూర్, సిమ్లా, కాలికట్, లెంగ్పుయ్(మిజోరాం), పాక్యోంక్(సిక్కిం), బారామతిల్లో టేబుల్టాప్ రన్వేలు ఉన్నాయి.
ప్రమాదాలకు కేరాఫ్ టేబుల్- టాప్ రన్వే:
2010లో ఎయిరిండియా విమానం మంగళూర్ ఎయిర్ పోర్టులో క్రాష్ కావడంతో 158 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళూర్ ఘటన జరిగిన పదేళ్ల తర్వాత ఆగస్టు 07, 2020లో మరో టేబుల్ టాప్ రన్ వేపై విషాదం నెలకొంది. కోవిడ్ మహమ్మారి కారణంగా దుబాయ్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువస్తున్న క్రమంలో కోజికోడ్లో ఎయిర్ ఇండియా విమానం టేబుల్ టాప్ రన్ వే నుంచి జారి కిందకు పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు మరణించారు. 169 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 1977లో పోర్చుగల్లోని మదీరా విమానాశ్రయంలో టేబుల్ టాప్ రన్ వే కలిగిన ఎయిర్పోర్టులో కూలిపోయి 131 మంది మరణించారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!